” ఇది మా సౌత్ సినిమా అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది ” … శృతిహాసన్ సెన్సేషనల్ కామెంట్స్..!

నటి శృతిహాసన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన అందంతో, నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక తాజాగా సలార్ మూవీలో హీరోయిన్గా నటించి మంచి పేరు ప్రఖ్యాతలను పొందింది. ఇక ఈ ఏడాది మొదటి నుంచి వరుసగా నాలుగు హిట్ సినిమాలతో ప్రేక్షకులని పెద్ద ఎత్తునే సంతృప్తి పరిచింది. ఇక ఈ ఏడాది చివరిలో కూడా బ్లాక్ బస్టర్ హిట్ సినిమాని తన సొంతం చేసుకుంది.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా శృతిహాసన్ హీరోయిన్గా నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” సలార్ ” ఏ రేంజ్ సక్సెస్ ని అందుకుంటుందో మనందరికీ తెలిసిందే. ఈ మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ డే ఫస్ట్ షోకే పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కు ఈమె దూరంగా ఉన్నప్పటికీ.. బుల్లితెర కార్యక్రమాలలో భాగంగా ఈ మూవీ ప్రమోషన్ల నిమిత్తం పాల్గొంది. న్యూ ఇయర్ వేడుకలను ప్రారంభించుకుని బుల్లితెరపై మోస్ట్ అవైటెడ్ దావత్ అనే కార్యక్రమంలో శృతిహాసన్ సలార్ మూవీ ప్రమోషన్స్ నిమిత్తం పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగానే ఈమె సలార్ సినిమా గురించి ప్రభాస్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఈమె మాట్లాడుతూ…” అసలు దావత్ అంటేనే ప్రభాస్. ఆయన మొదటి షెడ్యూల్ షూటింగ్ సమయంలో నలుగురు ఉన్నారు అని చెబితే ఏకంగా 400 మందికి సరిపడే భోజనాలను తీసుకొచ్చారు. ప్రభాస్ చాలా కేరింగ్ పర్సన్. ఇక ఈ సినిమా హిట్ అవ్వడానికి ప్రభాస్ యాక్టింగ్ ఏ కారణం. నిజానికి సలార్‌ సినిమా మన సౌత్ సినిమాని సౌత్ మూలాలు ఉన్నటువంటి సినిమా. ఇది మన సౌత్ సినిమా అని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది ” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.