టాలీవుడ్ బ్యాచిలర్ హీరోల లిస్టులో అడవి శేష్ ఒకరు. చివరిగా టాలీవుడ్లో హిట్ మూవీ సిరీస్లతో వరుస బ్లాక్ బాస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఇక అడవి శేష్ ఫ్యాన్స్కు క్రిస్మస్ ముందుగానే వచ్చిందని చెప్పాలి. సూపర్ స్టార్ అడవి శేష్, శృతిహాసన్ మెగా పాన్ ఇండియా యాక్షన్ డ్రామాలో నటించబోతున్నారంటూ మేకర్స్ మంగళవారం అనౌన్స్ చేశారు. అడవి శేష్ 2022లో చేసిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్.. అయినా మేజర్ మూవీ హిందీ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమాతో అడవి శేష్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.
అయితే ఇప్పుడు నటించబోతున్న టైటిల్ రివీల్ కానీ ఈ ప్రాజెక్ట్ అడవి శేష్కు రెండో స్ట్రైట్ హిందీ మూవీ కాబోతోంది. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు.. క్యారెక్టర్, పోస్టర్, టైటిల్ సహా సినిమాకి సంబంధించిన అన్ని కీలకమైన విషయాలను మేకర్స్ త్వరలోనే రివిల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ మెగా ప్రాజెక్టును అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్షన్ లో నాగ్ మేనకోడలు సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. యుఎస్ లో పుట్టి పెరిగిన షానెల్ డియో ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన గతంలోనే అడవి శేష్ నటించిన క్షణం, గూఢాచారి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు డివోపిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
అయితే షానెల్ డియో డైరెక్టర్ గా ఇది మొదటి సినిమా కావడం విశేషం. ఇక కెన్స్ ఫిలిమ్ ఫెస్టివల్కు ఎంపికైన లైలా ఫిలిం కు ఇతనే దర్శకుడుగా వ్యవహరించాడు. ఇక శృతి హాసన్, అడవి శేష్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాలో డైలాగ్ సీన్స్, సన్నివేశాలు అన్ని హిందీ తో పాటు తెలుగులో కూడా సపరేట్ సపరేట్గా తెరకెక్కిస్తున్నామని.. భాషకు సంస్కృతికి తగ్గట్లుగానే డిఫరెంట్గా సినిమాల్లో సన్నివేశాలు ఉంటాయని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు సునీల్ నారం.. సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అడవి శేష్ – షానెల్ డియో కలిసి కథ, స్క్రీన్ప్లే చూసుకున్నారు. ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలు త్వరలోనే మేకర్స్ తెలియజేస్తారు.