టాలీవుడ్ లో బాలయ్య, రామ్ చరణ్ కు ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక నందమూరి నటసింహం బాలయ్య ఇటీవల వరుస హ్యాట్రిక్ సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాబి దర్శకత్వంలో తన 109వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు బాలయ్య. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి తగ్గట్టుగానే గతంలో నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా సెకండ్ హాఫ్ లో ఉండే లాస్ట్ 40 మినిట్స్ వేరే లెవెల్ లో ఉండబోతుంది అంటూ చెప్పుకొచ్చాడు.
పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై నాగ వంశీ కామెంట్స్ తో ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక రామ్ చరణ్, బాలకృష్ణ ఇద్దరిలో ఉండే కామన్ పాయింట్ ఇదేనంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బాలయ్యకాని, రామ్ చరణ్ కానీ ఏదైనా కథను విని దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత దర్శకుడు చెప్పినది చేయడానికి ఎంతైనా కష్టపడతారట. డైరెక్టర్ ఏది చెప్తే అదే ఫాలో అవుతూ ఉంటారట. ఈ విషయాన్ని బట్టి బాలయ్య, రామ్ చరణ్ ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే దర్శకుడిని ఏ విధంగా నమ్ముతారో అర్థమవుతుంది.
ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో నిన్న, మొన్న అడుగుపెట్టి హీరోలుగా పాపులారిటీ దక్కించుకున్న చిన్న హీరోలు కూడా దర్శకులకు ఉచిత సలహాలు ఇస్తూ.. అలా కాదు ఇలా చేయండి, అది కాదు ఇది చేయండి అంటూ సినిమా కథను మార్చేస్తూ ఉంటారు. అయితే బాలయ్య, రామ్ చరణ్ టాలీవుడ్ స్టార్ హీరోలుగా భారీ పాపులారిటి దక్కించుకున్నా ఇప్పటికీ డైరెక్టర్ చెప్పిందే ఫాలో అవుతూ వారు చెప్పిన దానిపైనే కష్టపడుతూ ఉంటారట. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ విషయంలో చెర్రీ, బాలయ్య ఇద్దరు చాలా గ్రేట్ అంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.’