బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్, అర్జున్ రెడ్డి ఫెమ్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో తెరకెక్కిన మూవీ యానిమల్. డిసెంబర్ 1న రిలీజైన ఈ సినిమా భారీ బ్లాక్ బాస్టర్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ మూవీలో రష్మిక మందన హీరోయిన్గా నటించింది. రష్మికతో పాటు.. సెకండ్ హీరోయిన్గా తృప్తి దిమ్రి మరో పాత్రలో నటించింది. జోయా పాపగా ప్రేక్షకులను మెప్పించిన ఈ బ్యూటీ.. ఈ సినిమాలో బోల్డ్ పాత్రలో నటించి కుర్ర కారును ఆకట్టుకుంది. యానిమల్ తో ఓవర్ నైట్ స్టార్ బ్యూటీగా క్రేజ్ సంపాదించుకున్న తృప్తికి కేవలం జోయా రోల్ కోసం రూ.40 లక్షల రెమ్యూనరేషన్ మాత్రమే వచ్చినట్లు లైఫ్ స్టైల్ ఏషియా రిపోర్టులో వెల్లడించారు.
ఇక యానిమల్ తో భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ imdb రిలీజ్ చేసిన పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ ఫీచర్స్లో టాప్ లో ఉంది. ఆమె తర్వాత స్థానంలో యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఉన్నాడు. ఈ మూవీతో ఆ రేంజ్లో క్రేజ్ సంపాదించుకున్న తృప్తి అంత తక్కువ రమ్యునరేషన్ తీసుకోవడం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అందులోనూ ఈ సినిమాలో ఆమె చాలా బోల్డుగా కనిపించింది. నిజానికి మూవీ హీరోయిన్ రష్మిక మందన్న రెమినరేషన్తో పోలిస్తే ఈమెది కేవలం పదో వంతు మాత్రమే అని తెలుస్తుంది.
ఈ మూవీ కోసం రష్మికకు రూ.4 కోట్ల రెమినరేషన్ ముట్టిందట. రణ్ వీర్కు రూ.70 కోట్లు, బాబి డియోలోకి రూ.4 కోట్లు, అనిల్ కపూర్ కు రూ.2 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సమాచారం. వీరందరితో పోలిస్తే తృప్తికి వచ్చిన రెమ్యునరేషన్ తక్కువే అయినా ఈ సినిమాతో ఆమె మార్కెట్ మాత్రం వేరే రేంజ్కి వెళ్ళింది. ఈ సినిమా తర్వాత ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు లిస్ట్ కూడా ఏకంగా రూ.30 లక్షలకు చేరుకుంది. యానిమల్ రిలీజ్ కి ముందు ఆరు లక్షలు ఉన్న ఫాలోవెర్లు ఏకంగా 37 లక్షలకు పెరిగారంటే ఆమె ఎంతమంది ప్రేక్షకులను ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు.