” యానిమల్ ” మూవీకి భారీ షాక్.. లబోదిబోమంటున్న మేకర్స్..!!

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” యానిమల్ “. ఇక శుక్రవారం విడుదలైన ఈ మూవీ సక్సెస్ఫుల్గా దూసుకుపోతుంది. కానీ తొలి షో తోనే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకి పైరసీ‌ షాక్ తగిలింది. యానిమల్ విడుదలై 24 గంటలు కాకముందే ఇంటర్నెట్లో దర్శనమిచ్చింది.

తమిళ్ రాకర్స్, మూవీ రూల్స్.. వంటి పైరసీ వెబ్ సైట్స్ ఈ సినిమాని ఉచితంగా, హెచ్డి క్వాలిటీ తో విడుదల చేశారు. విడుదలై.. రోజు గడవక ముందే ఇలా హెచ్ డి ప్రింట్ లీక్ కావడం వసూళ్లపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.

అయితే కోట్లు పెట్టి మరి ఈ చిత్ర డిజిటల్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. బిగ్ స్క్రీన్ పై 6-8 వారాలు ఆడిన తరువాత ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేలా అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నారు. అంటే సంక్రాంతికి లేదా రిపబ్లిక్ డే రోజున.. యానిమల్ మూవీ అందుబాటులోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇంతలోనే షాకింగ్ గా పైరసీ న్యూస్ బయటకు వచ్చింది. ఇక దీనిపై మేకర్స్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.