బిగ్ బ్రేకింగ్.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా ఆగిపోయింది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస పెట్టి క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తున్నాడు. ఈ ఏడాది సాయి ధరమ్ తేజ్‌తో కలిసి పవన్ నటించిన బ్రో సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చిన పవన్ రేంజ్‌లో హిట్ అయితే అవ్వలేదు. ప్రస్తుతం పవన్ నటిస్తున్న ఉస్తాద్‌ భగత్ సింగ్, హరిహర వీరమల్లు, ఓజి సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ఇక క్రిష్ దర్శకత్వంలో ఏ య‌మ్ ర‌త్నం నిర్మాతగా పవన్ నటిస్తున్న భారీ పీరియాడికల్ సినిమా హరిహర వీరమల్లు.

ఈ సినిమాలో పవన్ కు జోడిగా నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా.. బాలీవుడ్ ముద్దుగుమ్మ జాక్వ‌లిన్‌ ఫెర్నాండిస్‌ కీలక పాత్రలో కనిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో 2 ఏళ్ళ‌ క్రితమే ప్రారంభమైంది. అయితే షూటింగ్ ఎంతవరకు వచ్చింది.. ఎప్పుడు పూర్తవుతుంది.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో.. అసలు క్లారిటీ లేదు. అయితే ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న బాలీవుడ్ సీనియర్ హీరో బాబి డియోల్ దీనిపై క్లారిటీ ఇచ్చేశాడు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అందుబాటులో లేకపోవడంతో.. ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా నిలుపుదల చేశామని.. పవన్ మళ్లీ డేట్‌లు ఇచ్చిన వెంటనే హరిహర వీరమల్లు షూటింగ్ మొదలవుతుందని తెలిపాడు. ఇక పవన్ ఒక సూపర్ స్టార్ అని.. ఆయనతో నటించడం తనకు ఎంతో సంతోషంగా ఉందంటూ పవన్ పై ప్రశంసలు కురిపించాడు. ఏది ఏమైనా హరిహర వీరమల్లు షూటింగ్ అయితే ఎప్పటిలో ఉండే అవకాశం లేదన్నది క్లారిటీ వచ్చేసింది. వచ్చే ఏప్రిల్ మే వరకు పవన్ ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉండనన్నాడు. ఆ తర్వాతే హరిహర వీరమల్లు సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.