బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా… రష్మిక మందన హీరోయిన్గా.. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” యానిమల్ “. ఇక ఈ సినిమా ట్రైలర్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసి.. డిసెంబర్ 1న రిలీజ్ అయింది. మొదటి షో తోనే సూపర్ హిట్ టాక్ ని అందుకుంది.
ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ దండయాత్ర మామూలుగా లేదనే చెప్పాలి. మొదటి రోజే 100 కోట్ల క్లబ్ లో చేరిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాలలో అయితే రెండు రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పటికి కూడా థియేటర్లలో ఈ సినిమా కలెక్షన్స్ రాబడుతుంది.
ఇక ఈ సినిమా 6 డేస్ కలెక్షన్స్ చూస్తే..రూ. 500 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సెన్సేషనల్ రికార్డ్ నెలకొల్పింది. అయినప్పటికీ ఇంకా ఈ సినిమా జోరు తగ్గలేదు. ఇక ఈ సినిమా ఇదే జోరుతో కొనసాగితే మాత్రం..రూ. 1000 కోట్ల క్లబ్లో చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పాలి. ఇక రాబోయే రోజుల్లో ఇంకెన్ని గ్రాస్ వసూళ్లను రాబడుతుందో చూడాలి మరి.