సినిమాలపై కీలక నిర్ణయం తీసుకున్న మెగా కోడలు…. అసలేం జరిగిందంటే…!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ” అందాల రాక్షసి ” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. అనంతరం వరుస సినిమాలతో దూసుకుపోయింది. ప్రస్తుతం వరుణ్, లావణ్యలు పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి మనకి తెలిసిందే. వీరి పెళ్లి ఇటలీలో జరిగింది. ఇటలీలో పెళ్లి అయిపోవడంతో హైదరాబాద్ కి చేరుకున్నారు మెగా ఫ్యామిలీ.

ఇక వీరికి సంబంధించిన పలు పెళ్లి ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా లావణ్య సినిమాల విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకుందని ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ ముద్దుగుమ్మ ఇకపై లేడీ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే తీయాలని ఆలోచించుకుందట. లేడీ ఓరియంటెడ్ సినిమా తప్ప మిగతా ఏ సినిమా చేసిన రొమాంటిక్ సీన్స్ ఉంటాయని.. దానివల్ల మెగా ఫ్యామిలీ పరువు పోతుందని ఈమె ఈ నిర్ణయం తీసుకున్నట.

మెగా ఫ్యామిలీ తనకి ఎలాంటి కండిషన్లు పెట్టకపోయినప్పటికీ.. తను మెగా ఫ్యామిలీ కోడలుగా తన బాధ్యత నిర్వహించాలని ఈ నిర్ణయం తీసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్త విన్న ప్రేక్షకులు…” మెగా కోడలు అనిపించుకున్నావు. నీ ఆలోచన చాలా బాగుంది. దానికి కట్టుబడి ఉంటే ఇంకా బాగుంటుంది. మీరు ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో హ్యాపీగా ఉండాలి ” అంటూ కామెంట్లు చేస్తున్నారు.