అజిత్ నెక్స్ట్ సినిమాను డైరెక్ట్ చెయ్యనున్న యంగ్ డైరెక్టర్.. అతను ఎవరో తెలుసా..?

టాలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన తదుపరి విదా ముయార్చి చిత్రంలో కనిపించనున్నారు. తాడం ఫేమ్ మగిజ్ తిరుమేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అజర్బైజాన్లో శ‌రవేగంగా జరుగుతుంది.

 

ఇప్పుడు, నటుడి 63వ చిత్రానికి సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా మార్క్ ఆంటోనీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అధిక్ రవిచంద్రన్ అజిత్ 63వ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం అజిత్, అధిక్ రవిచంద్రన్ కథ చర్చల్లో పాల్గొన్నట్లు తెలుస్తుంది.

అలాగే ఈ ప్రాజెక్టును ఎల్రెడ్ కుమార్ నేతృత్వంలోని ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యాంక్రోల్ చేస్తుందని చెబుతున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.