మధుర మీనాక్షి ఆలయం కలశాన్ని తాకిన తొలి మహిళ ఆ ట్రెడిష‌న‌ల్ బ్యూటి.. ఎవరంటే.. ?

తొలివలపు మూవీ తో టాలీవుడ్‌కి పరిచయమైంది స్నేహ. ముంబైలో జన్మించి దుబాయ్‌లో పెరిగిన ఈ ముద్దుగుమ్మ ట్రెడిషనల్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే స్నేహ అస‌లు పేరు సుహాసిని. నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన స్నేహ తెలుగు, తమిళ, మ‌ళ‌యాళం భాషల్లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. ఒకప్పుడు టాలీవుడ్ అగ్ర హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న స్నేహ తన జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేని ఒక అద్భుతమైన అదృష్టాన్ని సొంతం చేసుకుంది.

మధుర మీనాక్షి ఆలయంలోని కలశాన్ని తాకిన తొలి మహిళ స్నేహ కావడం విశేషం. సుశీ గణేషన్ డైరెక్షన్లో హీరో సుశాంత్ సరసన స్నేహ న‌టించింది. ఈ సినిమా వీరుంభం టైటిల్‌తో తెర‌కెక్కింది. ఈ సినిమాల్లో స్నేహ పల్లెటూరి అమ్మాయిగా మెప్పించింది. ఈ సినిమాలో మధురైలోని మీనాక్షి అమ్మవారి ఆలయగోపురం పైన ఉన్న కలశాన్ని తాకిన దృశ్యం కనిపిస్తుంది. సాధారణంగా మధుర మీనాక్షి అమ్మ దేవాలయం గోపర కలశాన్ని ఏ స్త్రీ తాకలేదు.

కానీ ఓ సన్నివేశం కోసం స్నేహ ఆ కలశాన్ని తాకేలా ఈ సినిమాలో ఏర్పాటు చేశారు. ఆ విధంగా మధుర మీనాక్షి అమ్మవారి ఆలయ గోపుర కలశాన్ని తాకిన మహిళగా స్నేహ రికార్డ్ సృష్టించింది. ఈ సీన్ షూటింగ్ టైమ్‌లో దర్శకుడు స్నేహతో ఈ విషయాన్ని ప్రస్తావించారు. స్నేహ చాలా సంతోషించింది. కలశాన్ని పట్టుకున్న తర్వాత కిందకు రాగానే గుడి పూజారి స్నేహ చాలా అదృష్టవంతురాలని.. ఇంతకుముందు ఎవరికీ లేని వరం ఆమెకు దక్కిందంటూ చెప్పుకొచ్చారట.