బిగ్బాస్ సీజన్ 7 రసవక్తంగా సాగుతుంది. 4 వారాలు పూర్తిచేసుకుని 5 వారంలో అడుగుపెట్టారు. 14 మందితో స్టార్ట్ అయిన ఈ షోలో ఇప్పటివరకు నలుగురు ఎలిమినేట్ కాగా ప్రస్తుతం హౌస్ లో పదిమంది ఉన్నారు. అయితే ఈ సీజన్ ఉల్టా పుల్టాగా అన్నట్టుగానే సాగుతుంది.
సందీప్, శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్ గెలుచుకున్న పవర్ అస్త్రాలను తీసుకున్న బిగ్ బాస్.. వాళ్లని కూడా కంటెస్టెంట్లు గానే నిర్ణయించాడు. మొన్నటి వరకు పవర్ అస్త్ర టాస్క్ పెట్టిన బిగ్ బాస్… ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్ పెట్టాడు. అయితే ప్రస్తుతం హౌస్ లో 10 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. కానీ 10 వారాల ఆట మిగిలి ఉండగా.. టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ మినహా 7,8 మంది కంటెస్టెంట్స్ కావాల్సిందే.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ 2.0 పేరుతో ఈ ఆదివారం రాత్రి 7 గంటల నుంచి బిగ్ బాస్ మరో గ్రాండ్ లాంచ్ చేయనున్నాడు. ఈ మేరకు ఈ ఆదివారం హౌస్ లోకి కొత్త కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. అందులో ఒకరు ప్రముఖ టీక్ టాక్ స్టార్ నయనీ పావని అని సమాచారం. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇది నిజమో కాదో తెలియాలంటే ఈ ఆదివారం వరకు వేచి చూడాల్సిందే.