బంగారం ఇష్టంలేనివారు ఎవరుంటారు. ఇక మహిళలకు బంగారం అంటే ఎంత ఇష్టం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందంటే.. పార్టీలు, ఫంక్షన్లు, పండగలు వచ్చాయంటే ఎక్కువగా పసిడిని అలంకరించి మెరిసిపోతుంటారు. అయితే కొత్తగా కొన్నప్పుడు ఇవి మెరిసినంతగా వాడే కొద్ది మెరుపు ఉండవు. అలాంటప్పుడు వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. కొత్త వాటిలా మెరిసిపోవాలంటే ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే సరిపోతుంది.
గోల్డ్ జ్యువెలరీని క్లీన్ చేసేందుకు శుభ్రమైన నీటిని ఒక గిన్నెలోకి తీసుకొని దాన్ని కొద్ది సోప్ వాటర్ వేసి తర్వాత బంగారు నగలను 10 నిమిషాల పాటు నానబెట్టాలి. కొంతసేపటి తర్వాత సాఫ్ట్ బ్రష్ తో రుద్దడం వల్ల కొత్త నగలు లాగా మెరిసిపోతాయి కొద్దిగా టూత్ పేస్ట్ తీసుకుని బ్రష్పై వేసి నగలపై రుద్దండి దీంతో దుమ్ము, దూళిపోతాయి. నగలు నుంచి మురికిని క్లీన్ చేసేందుకు మంచినీటితో మృదువైన క్లాత్ ని ఉపయోగించితుడిస్తే బంగారం మెరుస్తుంది.
అలాగే గోల్డ్ జ్యువెలరీ ఓ గిన్నెలో ఉంచి ఆ జ్యూవెలరీ మునిగేంత వరకు గోరువెచ్చని నీరు పోసి కొంతసేపు ఆ నీటిలో ఆభరణాలను నాన్ననివ్వాలి. దీని ద్వారా ఆభరణాలకు ఉన్న మురికి, జుట్టు తొలగిపోతాయి. ఆభరణాలను వేడి నీటిలో ఉంచి మెత్తని బ్రష్ లేదా కాటన్ క్లాత్ తో క్లీన్ చేసుకుంటే ఆ నగలు కొత్త వాటిలా మెరుస్తాయి.