అదిరిపోయే రేంజ్ లో భగవంత్ కేసరి ఓటిటి డీల్..!!

ప్రస్తుతం నందమూరి నట‌సింహ బాలయ్య నటిస్తున్న మూవీ భగవంత్‌ కేసరి. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో రూపొందించిన ఈ సినిమాను అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు మూవీ మేకర్స్. ఇక బాలయ్య సినీ కెరీర్‌లోనే రికార్డ్ స్థాయి ధరలో భగవంత్‌ కేసరి ఓటీటీ డీల్ ముగిసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో భగవంత్‌ కేసరి డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది.

బాల‌య్య‌ కెరీర్‌లో రికార్డు ఓటీటీ ఇదే అని ఫిలిమ్‌నగర్ వర్గాలు పేర్కొన్నాయి. బాలకృష్ణ భగవంత్‌ కేసరి సినిమా ప్రమోషన్లు కూడా మొదలైన సంగతి తెలిసిందే. మొదటి సింగల్ కంటే రెండో సింగిల్ ఉయ్యాలో ఉయ్యాల ఎమోషనల్ సాంగ్ ప్రేక్షకులలో అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది. ట్రైలర్ కోసం కోట్లాదిమంది ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. బాలయ్య ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రజలు కూడా ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అని ఎదురుచూస్తున్నారు.

షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గరికిపాటి, హరీష్ పెద్ది ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో జాతీయ అవార్డు గ్రహీత అర్జున్ రామ్‌పాల్ న‌టిస్తున్నాడు. ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు అర్జున్ రామ్‌పాల్‌. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా, శ్రీ లీల కీలక పాత్రలు నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ అక్టోబర్ 8న రిలీజ్ కాబోతుంది. ఇక ఈ ట్రైలర్ ప్రేక్షకుల్లో ఎటువంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ హనుమకొండ వరంగల్‌లో గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీమ్‌.