టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి హవా ఇప్పటికీ కొనసాగుతోంది. సీనియర్ హీరో అయినప్పటికీ.. ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీగా వరుస సినిమాలు చేస్తున్నారు. సినిమాల్లో తన డ్యాన్స్, తన స్ట్రైల్ మేనరిజం, డైలాగ్ లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉన్నాడు. ఇక చిరంజీవికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ ఆయన ఫ్యాన్ బస్ చెక్కుచెదరకుండా అలాగే ఉంది. మధ్య కొన్ని సంవత్సరాలపాటు సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వెళ్లారు. ఆ తర్వాత సినిమాలోకి రీ ఎంట్రీ ఇచ్చిన చిరు.. వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు.
అయితే చిరంజీవిపై కూడా మీడియాలో అనేక తప్పుడు కథనాలు వస్తూ ఉంటాయి. కొన్ని వ్యక్తిగత విషయాలు మీద రూమర్స్ స్పెడ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వార్తలు విని చిరంజీవి కన్నీళ్లు పెట్టుకున్నాడట. ఒక జర్నలిస్ట్ రాసిన తప్పుడు వార్తలు చూసి చిరంజీవి ఎమోషనల్ అయ్యాడు. సెలబ్రెటీలపై జర్నలిస్టులు అనేక వార్తలు రాస్తూ ఉంటారు. వాటిల్లో కొన్ని నిజాలు ఉండవు. అలాంటి ఫేక్ వార్తలు చిరంజీవిపై కూడా కొన్ని వచ్చాయి. వాటిని చూసి చిరంజీవి చాలా బాధపడ్డారట. తాజాగా ఓ సీనియర్ జర్నలిస్ట్ రాసిన పుస్తకాన్ని చిరంజీవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తనకు ఎదురైన అనుభవాలను చిరంజీవి గుర్తు చేసుకున్నాడు.
తాను ఇండస్ట్రీకి వచ్చినప్పటినుంచి సినీ జర్నలిస్టులతో ఎంతో మంచి అనుబంధం ఉండేదని తెలిపారు. జర్నలిస్టుల పవర్ మొత్తం పెన్ను, వాళ్లు రాసే రాతలోనే ఉంటుందని అన్నారు. కానీ పెన్నుతో రాసేవి కొన్ని నిజాలు అయితే, మరికొన్ని అబద్ధాలు కూడా ఉంటాయని వ్యాఖ్యానించాడు. తనపై కూడా అనేక తప్పుడు వార్తలు రాశారని, వాటిని తాను ఎప్పుడూ మర్చిపోలేనని అన్నారు. ఆ వార్తలు చూసి తాను బాధపడిన సందర్భంగా కూడా ఉన్నాయని, కొంతమంది జర్నలిస్టులు మాత్రం ఎదుటివారు బాధపడే విధంగా తప్పుడు వార్తలు రాస్తూ ఉంటారని అన్నారు. తప్పుడు వార్తలు తన జీవితంపై ఎంతో ప్రభావం చూపిస్తాయని చిరంజీవి తెలిపాడు.
జర్నలిస్టు రాసిన తప్పుడు వార్తలకు చిరంజీవి కన్నీళ్లు.. అసలు ఏం జరిగిందో తెలుసా..?
