టాలీవుడ్ హీరోయిన్ మీనా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ దసలవారీగా ఎదుగుతూ 1990ల్లో స్టార్ హీరోయిన్ స్టేజ్ కి ఎదిగింది. 2019లో ప్రముఖ బిజినెస్ మ్యాన్ విద్యాసాగర్ ను వివాహం చేసుకున్న ఈమెకు నైనిక అనే కుమార్తె ఉంది. గత ఏడాది మీనా భర్త విద్యాసాగర్ కరోనా కారణంగా మృతి చెందాడు. ఈ దుఃఖం నుంచి తీరుకొని ఎందుకు ఆమె చాలా టీవీ షోలో పాల్గొంటూ సందడి చేసింది.
వివాహం తర్వాత ఇండస్ట్రీకి దూరమైనా మీనా గత ఏడాది నిర్వహించిన మీనా అభినందన సభకు హాజరైంది ఇందులో స్పెషల్ గెస్ట్ గా సూపర్ స్టార్ రజినీకాంత్ లాంటి అగ్ర హీరో పాల్గొని మనోధైర్యాన్ని నింపారు. ఎంతో మళ్ళీ కెమెరా ముందుకు వచ్చేందుకు రెడీ అయింది ఈ బ్యూటీ. మళ్ళీ కెమెరా ముందు నిలబడటం ఆనందంగా ఉందని.. మరో మరచిపోలేని పాత్రలో నటిస్తున్న అంటూ క్లాప్ బోర్డ్ ఫోటోతో ఈ విషయాన్ని మీనా తన సోషల్ మీడియా వేదిక వెల్లడించింది. ఈ మధ్య మీనా మరో పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు వినిపించాయి.
ఆ రూమర్స్ పై మీనా స్పందించలేదు మౌనంతో సమాధానం ఇచ్చింది. ఇక తాజాగా మీనా తన కెరీర్ పై ఫోకస్ పెట్టిందని ఎలాగైనా సెటిల్ అవ్వాలని అనుకుంటుందని సమాచారం. అందుకే మళ్ళీ ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చిందట మీనా. ప్రస్తుతం మలయాళ దర్శకుడు జయ జోస్ రాజ్ సినిమాలో కీలకపాత్రను నటిస్తున్న ఈమె త్వరలోనే టాలీవుడ్ లో మరో స్టార్ హీరో సినిమాలో నటించబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలు ఎంత నిజముందో మీనా స్పందిస్తే కానీ తెలియదు.
View this post on Instagram