చాలామందికి మొక్కజొన్నపత్తు అంటే చాలా ఇష్టం. కొంతమంది కాల్చిన పొత్తును తింటారు. మరి కొంతమంది ఉడికించిన పొత్తును తింటారు. మరి ఈ రెండిట్లో ఏది తింటే బెటర్ ఓ ఇప్పుడు తెలుసుకుందాం. ఉడికించిన లేదా కాల్చిన మొక్కజొన్న పై కాస్త ఉప్పు, కారం రాసుకుని తింటే ఆ మజానే వేరు.
ఎంతో మందిలో ఉన్న సందేహం మొక్కజొన్నను కాల్చి తింటే ఆరోగ్యకరమా లేక ఉడికించి తింటే ఆరోగ్యకరమా. మొక్కజొన్నను నీళ్లలో ఉడికించి తింటేనే ఎక్కువ ఆరోగ్యకరం. కాల్చిన మొక్కజొన్నలు తినడం వల్ల.. మొక్కజొన్న గింజల్లో కొన్ని నల్లగా పైపైన మండిపోతాయి. ఇలా నల్లగా మాడిన ఆహారాన్ని తినకూడదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
కాల్చిన మొక్కజొన్న కంటే ఉడికించిన మొక్కజొన్న తినడమే ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిది. అలాగే వాటిపై పచ్చి ఉప్పు, కారాన్ని రాసుకోవడం తగ్గించండి. పచ్చి ఉప్పు వల్ల అధిక రక్తపోటు బారిన త్వరగా పడతారు. ఉడికించిన మొక్కజొన్నను అలా సాదాగా తినేందుకే ప్రయత్నించండి. అవసరమైతే నిమ్మకాయను రుద్దుకుని తింటే రుచి బాగుంటుంది. కానీ ఉప్పుని రాసుకోకపోవడమే అన్ని విధాల మంచిది.