వన్డే ప్రపంచ కప్ 2023 ప్రైజ్ మనీ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు….!!

వన్డే వరల్డ్ కప్ 2023 ప్రైజ్ మనీ వివరాలను ఐసిసి (సెప్టెంబర్ 22) ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఐసిసి ఈసారి భారీ ప్రైజ్ మనీని ప్రకటించింది. మొత్తం ప్రైజ్ మనీ రికార్డ్ స్థాయిలో 10 మిలియన్ యూఎస్ డాలర్లుగా నిర్ణయించబడింది. ఇండియన్ కారెన్సీలో దీని విలువ దాదాపు 83 కోట్లు ( 82 కోట్ల, 93 లక్షల, 57 వేల, 500 రూపాయలు). ఈ మొత్తం ప్రైజ్ మనీ విజేత, రన్నరప్,సెమీ ఫైనలిస్ట్లు, గ్రూప్ స్టేజ్ల్లో నిష్ర్కమించిన జట్టు మధ్య విభజించబడుతుంది.

పైన పేర్కొన్న మొత్తంలో వరల్డ్ కప్ విజయతకు 40 లక్షల యూఎస్ డాలర్లు దక్కుతాయి. రణరపుకు 20 లక్షల యూఎస్ డాలర్లు దక్కుతాయి. సెమీ ఫైనలిస్ట్ కు 8 లక్షల యూఎస్ డాలర్లు… గ్రూప్ స్టేజీలో నిష్ర్కమించిన జట్లకు లక్ష యూఎస్ డాలర్లు… గ్రూప్ స్టేజ్లో మ్యాచ్ గెలిచిన జట్టుకు 40 వేల యుఎస్ డాలర్లు ప్రైజ్ మనీగా అందుతాయి. ఈ స్థాయిలో ప్రైజ్ మనీ అందనుండటం ఐసీసీ చరిత్రలో బహుశా ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న విషయం మనందరికీ తెలిసిందే.

డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్ గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఆహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక కానుంది.ఈ టోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్ను అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో ఆడుతుంది. టీమిండియా తమ చిరకాల ప్రత్యర్థి పాక్న ను అక్టోబర్ 14న నరేంద్ర మోడీ స్టేడియోలో ఢీకొడుతుంది. నవంబర్ 19న జరిగే ఫైనల్ తో మెగా టోర్నీ ముగుస్తుంది.