సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబంలో ఉన్న కామన్ క్వాలిటీ ఏంటో గుర్తించారా..!?

మనం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంచి స్టార్ డ‌మ్‌ అందుకున్న ఫ్యామిలీలో ఘట్టమనేని ఫ్యామిలీ కూడా ఒకటని చెప్పాలి. ఈ ఫ్యామిలీ నుంచి సూపర్ స్టార్ కృష్ణ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టి ఆ తర్వాత దర్శకుడిగా, నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. కృష్ణ తర్వాత ఆయన నట వారసుడుగా మహేష్ బాబు టాలీవుడ్ లో అడుగుపెట్టి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇలా మహేష్ బాబు హీరో గానే కాకుండా తెర వెనుక కూడా హీరో అనిపించుకున్నారని విషయం మనకు తెలిసిందే. ఇలా సూపర్ స్టార్ కృష్ణ నుంచి మొదలుపెట్టి మహేష్ బాబు మిగతా ఘట్టమనేని కుటుంబ సభ్యుల్లో కూడా ఒక కామ‌న్‌ క్వాలిటీ ఉందనే చెప్పాలి.. మరి వీరిలో ఉన్న ఆ కామన్ క్వాలిటీ ఏంటి.. అనేది ఇక్కడ చూద్దాం. ఈ ఫ్యామిలీలో ఉన్న కామన్ క్వాలిటీ ఏంటి అన్న విషయానికి వస్తే.. ద‌య, జాలి ఇతరులకు సహాయ పడటం అనే చెప్పాలి.

సూపర్ స్టార్ కృష్ణ హీరోగా కొనసాగే సమయంలో ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే వారికి తోచిన సాయం చేస్తూ అండగా నిలిచేవారు. ఇదే అలవాటు మహేష్ బాబు లో కూడా కూడా ఉంది.. ఇక ఈయన ఏకంగా మహేష్ బాబు ఫౌండేషన్ స్థాపించడమే కాకుండా ఎంతోమంది పిల్లలకు గుండె ఆపరేషన్ చేయిస్తూ గొప్ప మనసును చాటుకున్నారు. అలాగే మహేష్ అడుగుజాడల్లోనే తన పిల్లలు సితార- గౌతమ్‌ కూడా నడవడం ఇక్కడ విశేషం.

తాజాగా సితార జువెలరీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించరు..ఆ జువెలరీ సంస్థకు యాడ్ చేసినందుకు ఈమెకి కోటి రూపాయలు రెమ్యూనిరేషన్ వచ్చింది. ఇక ఆ కోటి రూపాయలను చారిటీలకు విరాళంగా ప్రకటించి తన గొప్ప మనసును చాటుకుంది. అలాగే తన పుట్టినరోజు సందర్భంగా అనాధ పిల్లలకు సైకిల్లు కానుక ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇక ఎప్పుడు తాజాగా మహేష్ కొడుకు గౌతమ్ కూడా తన తండ్రి మహేష్ ఫౌండేషన్‌తో అనుసంధానమైనటువంటి ఆసుపత్రులకు వెళ్లి అక్కడ వారి ఫౌండేషన్ ద్వారా లబ్ధి పొందినటువంటి చిన్నారులను కలిసి వారితో సమయం గడుపుటమే కాకుండా వారికి ఎన్నో ఖరీదైన బహుమతులు కూడా ఇచ్చి వారిని ఆనందింప చేశారు. ఇలా ఈ కుటుంబంలోనే ప్రతి ఒక్కరు కూడా ఇతరుల పట్ల జాలి దయ ప్రేమ అనే ఒక కామన్ క్వాలిటీ కలిగి ఉంటారని చెప్పాలి.