పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత ఊహించిన రేంజ్లో ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోయినా సరే సినిమా సినిమాకి కొత్త రికార్డులను సృష్టిస్తున్నాడు. ఇక ఇటీవల ఆది పురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ఆ సినిమాతో ఫ్యాన్స్ని నిరాశపరిచాడు. ఓం రౌత్ మీద నమ్మకంతో ప్రభాస్ తీసిన సినిమా సక్సెస్ కాలేదు. ఆది పురుషపై ముందు నుంచి డౌట్ పడిన రెబల్ ఫ్యాన్స్ ఆ సినిమా హిట్ కాకపోయినా పెద్దగా ఫీల్ కాలేదు.
ఇక ప్రస్తుతం కే జి ఎఫ్, కే జి ఎఫ్ 2 లాంటి భారీ యాక్షన్ సినిమాలతో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్ సినిమాలో నటిస్తున్నాడు ప్రభాస్. అయితే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కేజిఎఫ్ లాగా ఓ రేంజ్ లో సినిమాలు రూపొందిస్తాడు అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ నమ్ముతున్నారు. రీసెంట్గా సలార్ నుంచి వచ్చిన గ్లింప్స్ కూడా ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి. సలార్ సినిమా పార్ట్ 1 సెప్టెంబర్ 28న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బిజినెస్ విషయంలో ప్రభాస్ రేంజ్ తెలుస్తుంది.
తెలుగులో రెండు రాష్ట్రాల్లోనూ సలార్ సినిమాకు రూ.150 కోట్లు బిజినెస్ జరిగిందట. ఆది పురుష్ రూ.130 కోట్లు మాత్రమే బిజినెస్ చేస్తే సలార్ ఇంకో రూ.40 కోట్లను యాడ్ చేసుకుని మొత్తం రూ.170 కోట్ల బిజినెస్ చేసిందని తెలుస్తుంది. నైజం హక్కులు రూ.60 కోట్లు, సీడెడ్ రూ.28 కోట్లు ఆంధ్ర రూ.75 కోట్లకు బిజినెస్ జరిగిందట. ఏపీ, తెలంగాణలో కలిసి రూ.150 కోట్లు సలార్ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో హీరోయిన్గా శృతి హాసన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. జగపతిబాబు, పృధ్విరాజ్ సుకుమార్ కీ రోల్స్లో నటిస్తున్నారు.