పలచటి చీరలో నాభి అందాలతో క‌వ్విస్తోన్న కార్తీక‌దీపం మౌనిత‌… ఫొటోలు చూశారా…!

టాలీవుడ్ లో చాలామంది స్టార్ హీరోయిన్లు అందాల ఆరబోతతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. గత కొంతకాలం నుంచి ఈ లిస్టులోకి బుల్లితెరన‌టులు, యాంకర్స్ కూడా యాడ్ అయిపోతున్నారు. రీసెంట్గా కార్తీకదీపం సీరియల్‌లో మౌనిత క్యారెక్టర్ లో నటించి పాపులారిటీ సంపాదించుకున్న కన్నడ బ్యూటి శోభా శెట్టి కూడా ఈ లిస్టులో జేరిపోయింది. కన్నడలో పలు సీరియల్స్ తో పాటు సినిమాల్లో కూడా నటించిన ఈ భామ తాజాగా తన ఫొటోస్ సోషల్ మీడియాలో పంచుకుంది.

ఇక 1569 ఎపిసోడ్లను నిరంతరాయంగా ముగించిన కార్తీకదీపం సీరియల్ ఒకప్పుడు భారతదేశంలోనే అత్యధిక టిఆర్పి సంపాదించిన సీరియల్ గా రికార్డ్ సాదించింది. ఈ సీరియల్‌తో హీరోయిన్‌ ప్రేమి విశ్వనాథన్‌తో స‌మాన‌మైన‌ పాపులారిటీ సంపాదించుకుంది విల‌న్ రోల్ ప్లేచేసిన నటి శోభా శెట్టి. ఇక ఇటీవల శోభా శెట్టి పోస్ట్ చేసిన గ్లామర్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పలచటి నల్ల రంగు చీరలో నాభి అందాలను చూపిస్తూ రకరకాలుగా క్యూట్ ఫోజులతో అందాలు ఆరబోసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఆ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఎంతో సాంప్రదాయంగా కనిపించే మీరు ఈ ఫొటోస్ లో చాలా అందంగా ఉన్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇటీవల తాజాగా ఈమె గురించి మ‌రో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. త్వరలోనే స్టార్ మా లో ప్రసారం కాబోతున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ 7లో ఈమె కంటిస్టెంట్‌గా రాబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.