ప్రపంచంలో కొన్ని ప్రాంతాలకు వెళ్లే ముందు వందసార్లు ఆలోచించుకోవాలి. నిజానికి ఈ భూమి మీద చాలావరకు పచ్చదనం, జీవం కనిపిస్తాయి. కానీ ఆ ప్రాంతంలో చావు, నిశ్శబ్దం మాత్రమే కనిపిస్తాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ప్రదేశం భూమిపై అత్యంత విషపూరితమైన ప్రాంతంగా పేరుపొందింది. అక్కడ విచిత్రమైన విషయం ఏమిటంటే ఇది ఏ ఎడారిలోనో లేదు. ఫ్రాన్స్ లోని పట్టణ ప్రాంతాలకి కొంచెం దూరంలో ఉంది.
ఒకప్పుడు మనుషులతో సందడిగా ఉన్న ఈ ప్రదేశం ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన ప్రదేశంగా ఎలా మారిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న విషపూరిత ప్రదేశాన్ని జోన్ రోగ్ అని అంటారు. కొందరు ఈ ప్రదేశాన్ని డేంజర్ జోన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ప్రదేశం ఫ్రాన్స్ లో ఉంది. గడిచిన 100 సంవత్సరాలుగా ఈ ప్రదేశానికి ఎవరు వెళ్లలేదు. ఇక్కడికి ఎవరినీ వెళ్ళనీయకుండా ప్రభుత్వం నిషేధిస్తుంది. నిజానికి ఈ ప్రాంతపు మట్టిలోనే కాదు ఇక్కడ నీటిలోనూ పూర్తిగా విషం నిండివుంది. ఇక్కడి పదార్థం ఏదైనా మనిషి, లేదా మరో జీవి నోటిలోకి వెళితే మరణం ఖాయమని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఈ దేశం విషపూరితంగా ఎలా మారింది:
మొదటి ప్రపంచ యూద్ధానికి ముందు ఈ ప్రదేశం జనం సందడితో ఉండేదని చెబుతున్నారు. ఇక్కడ ఒకప్పుడు మానవ నివాసాలు ఉండేవి. అయితే ఈ ప్రదేశం ప్రపంచ యుద్ధంలో ధ్వంసమైంది. ఇక్కడ లేక్కకు మించిన బాంబులు ప్రయోగించారు. ఈ ప్రాంతంలో రసాయన దాడులు జరిగాయి. ఇక్కడే గాలి కూడా విషపూరితమై… కొంతకాలం క్రితం ఇద్దరూ జర్మన్ శాస్త్రవేత్తలు పరిశోధనల కోసం ఇక్కడికి వెళ్లారు. ఇక్కడ మట్టిలోనే కాదు నీళ్లలో కూడా ఆర్సెనిక్ అధిక మొత్తంలో ఉందని తెలిసింది. దీనిలోని ఒక్క రేణువైనా ఏ జీవి నోటిలోకి వెళ్లిన మరణం ఖాయమని వారు తమ పరిశోధనలో గుర్తించారు.