ఆ విషయంలో మలయాళీ భామ నిత్యామీనన్ హీరోయిన్లు అందరికంటే ఎంతో స్పెషల్.. ఎందుకంటే. !?

మన తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు. వారిలో మలయాళ బ్యూటీ నిత్యమీనన్ స్పెషాలిటీ వేరు… తన క్యూట్ స్మైల్ తో, ఎక్స్ట్రాడినరీ ఎక్స్ప్రెషన్స్ తో అందచందాలతో మరీ ముఖ్యంగా తన హైట్ తో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ మలియాలి బ్యూటీ.. అయితే అలాంటి నిత్యామీనన్ ఓ విషయంలో హీరోయిన్లు అందరికంటే ఎంతో స్పెషల్ అంటూ కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో ఓ వార్తను వైర‌ల్‌ చేస్తున్నారు.

ఇంతకీ అంత స్పెషల్ గా మారటానికి కారణం ఏమిటి.. ఆ వార్త ఏమిటో ఇక్కడ చూద్దాం. నిత్యమీనన్ ఇప్పటికే సౌత్‌లో మంచి పేరున్న హీరోయిన్గా కొనసాగుతుంది.. అలాగే సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లో కూడా నటించింది. ఇదే సమయంలో గ‌త‌ కొన్నాళ్లుగా నిత్యామీనన్ టాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఈ మధ్యకాలంలో ఆమె పెళ్లి గురించి వస్తున్న వార్తలతో సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తూ వస్తుంది.

ఇప్పుడు ఈ విషయం పక్కన పెడితే ఇండస్ట్రీలో ఉండే చాలామంది హీరోయిన్లు వారి స్టైల్ విషయంలో అసలు వెనుకాడరు.. ఒక రోజు వేసిన డ్రెస్ మరుసటి రోజు వేయరు. అలాగే ఒకరోజు పెట్టుకున్న ఆభరణాలు, వాచీలు, చెప్పులు ఇలా ప్రతి ఒక్కటి ఒకసారి వేసుకుంటే మరోసారి అసలు వాడరు.అలాంటి హీరోయిన్ల అందరిలో నిత్యామీనన్ ఎంతో స్పెషల్ అట.. ఎందుకంటే ఈమే తన ఊహ తెలిసినప్పటి నుంచి తన కాళ్లకు పెట్టుకున్న పట్టిలను ఇప్పటి వరకు కూడా తీయలేదట.

 

మీరు వింటున్నది నిజమే.. నిత్య మీనన్ తన కాళ్ళకి తన ఊహ తెలిసినప్పుడు పట్టీలు పెట్టిందట. అప్పటి నుంచి ఇప్పటివరకు అసలు ఆ పట్టీలను ఎప్పుడూ తీయదట. ఒకవేళ సినిమా షూటింగ్లో ఎవరైనా దర్శకుడు చెప్తే ఆ ప‌ట్టీల‌ను తీస్తుందట.. ఇలా కొన్ని సంవత్సరాల నుంచి తన కాళ్లకు ఆ ప‌ట్టీలు ఉన్నాయని రీసెంట్ గా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్లు ఈ విష‌యంలో నిత్యమీనన్‌ అందరి హీరోయిన్ల కంటే చాలా స్పెషల్ అంటూ ఆమెపై పొగడ్తల వర్షం కురిపిస్తూ ఈ వార్తను వైరల్ చేస్తున్నారు.