లైగర్ సినిమాతో టాలీవుడ్ హీరోయిన్గా పరిచయమైంది హాట్ బ్యూటీ అనన్య పాండే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన పాన్ ఇండియా లెవెల్ లో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్గా బిజీ అయిపోయింది. గత కొంతకాలం నుంచి బాలీవుడ్ స్టార్ హీరో ఆదిత్యా రాయ్కపూర్తో అనన్య డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఇద్దరు కలిసి కార్లో వెళ్తు కెమెరాలకు చికడంతో ఈ రూమర్స్ మరింత బలపడ్డాయి. తాజాగా డ్రీమ్ గర్ల్ 2 సినిమాలో నటించిన అనన్య ఈ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉంటుంది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనన్య తనకి కాబోయెవాడు ఎలా ఉండాలి.. అతనిలో ఎలాంటి లక్షణాలు ఉండాలి.. అనే విషయాన్ని వెల్లడించింది. అనన్య, ఆయుష్మాన్ ఖురాన్ కలిసి నటించిన డ్రీమ్ గర్ల్ 2.. ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను 2019లో రిలీజై హిట్ కొట్టిన డ్రీమ్ గర్ల్ సినిమాకి సీక్వెల్ గా రూపొందించారు. ఇక అనన్య మాట్లాడుతూ నాకు మా నాన్నే ఆదర్శం నాకు కాబోయే వాడు మా నాన్నల దయ, ప్రేమ, ఫన్నీగా ఉంటే చాలు. ఆయనే నాకు బెంచ్ మార్క్ అంటూ చెప్పుకొచ్చింది. అయన చాలా గొప్ప వ్యక్తి.. అందుకే నాకు కాబోయే భర్తకు కూడా అలాంటి లక్షణాలు ఉండాలి అని చెప్పింది.
ఇక గత కొంతకాలంగా నా సినిమాలపై న్యూస్లు రాకపోవడంతో నా వ్యక్తిగత జీవితం పై ఎక్కువగా ధ్యాస పెడుతున్నారు. ఇకనైనా నా సినిమాలపై దృష్టి పెడతారేమో వేచి చూడాలి.. అంటూ కొన్ని కామెంట్స్ చేసింది. ఇక ఆదిత్య రాయ్ కపూర్తో ఉన్న రిలేషన్ పై ఇప్పటి వరకు ఎటువంటి రిప్లై ఇవ్వలేదు. ప్రస్తుతం వరుస సినిమాల్లో బిజీగా గడుపుతుంది అనన్య. డ్రీమ్ గర్ల్ 2 తర్వాత ఫర్హాన్ అక్తర్ సినిమాలో నటించబోతుంది దీంతోపాటే విక్రమ్ ఆదిత్య మోత్వాన్ని రూపొందించిన సైబర్ థ్రిల్లర్లో కూడా అనన్య కనిపించబోతుంది.