వరుణ్ తేజ్‌కి ఎలాంటి కథలు చూజ్ చేసుకోవాలో చెప్పింది చెర్రీనేఅట‌..!

ప్రజెంట్ టాలీవుడ్ లో మంచి పాపులారిటీ ఉన్న యంగ్ హీరోలలో వరుణ్ తేజ్ ఒకడు. ముకుంద సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన వరుణ్ అటు క్లాస్ ఇటు మాస్ ఓరియంటెడ్ మూవీలలో సినిమాలు నటిస్తు రెండిటిలోను సక్సెస్ సాధించాడు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్‌తో దూసుకుపోతున్న వరుణ్ చివరిగా ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీ కామెడీ ఎంటర్‌టైనర్గా తెరకెక్కింది.

ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్త డైరెక్షన్లో రూపొందుతున్న గాండీవధారి అర్జున్ మూవీతో పాటు.. శక్తి ప్రతాప్ సింగ్ ఆపరేషన్ వాలంటైన్ సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్న వరుణ్‌ తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. వ‌రుణ్ మాట్లాడుతు కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఇంటర్వ్యూలో భాగంగా వరుణ్ నా7వ‌ మూవీ పూర్తయిన తర్వాత రామ్ చరణ్ నాకు ఫోన్ చేశాడనిచెప్పాడు.

చెర్రీ అన్న మాట్లాడుతూ యూనిక్ కంటెంట్ ఉన్న కథలను ఎంచుకోమని.. మన చుట్టూ ఉన్న వ్యక్తుల మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని సేఫ్గా కథలవైపు అడుగులు వేయాలని.. కొత్త ప్రయోగాలు చేసే ముందు ఆలోచించుకోమని చెప్పాడు అంటూ వివరించాడు. కొత్త కథలను ఎంచుకుంటే నీకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందని అలాగే కొన్ని అంశాలను మూవీ ఎంపికలో గుర్తుపెట్టుకో అంటూ చెర్రీ మూవీస్ సెలక్షన్ విషయంలో వరుణ్ కి చెప్పిన సజెషన్స్ను చెప్పుకొచ్చాడు వరుణ్ తేజ్.