క్యాన్సర్ మహమ్మారిని దూరం చేసే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.క్యాన్సర్.. వేగంగా విస్తరిస్తున్న వ్యాధి. కారణం లేకుండా, వయసుతో సంబంధం లేకుండా, స్త్రీ, పురుష భేదం చూడకుండా చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. పెరుగుతున్న కాలుష్యం, రసాయనాల వినియోగం, ప్లాస్టిక్ వాడకంతో వ్యాధి బాధితులూ పెరుగుతున్నారు. అయితే ఈ వ్యాధి నియంత్రణకు, రాకుండా చేసేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ పరిశోధనలో మనం ఇంట్లో వాడే మసాలాతోనూ క్యాన్సర్కు చెక్ పెట్టవచ్చని నిపుణులు గుర్తించారు.
ఆ మసాలా ఏంటి.. ఎలా నిరోధిస్తుంది అనే వివరాలు తెలుసుకుందాం.ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మనం తీసుకునే ఆహార పదార్ధాలతోనే శరీరంలోని అవయవాలు సరిగా పని చేస్తాయి. వ్యాధులు, రోగాల బారినపడకుండా కాపాడుతాయి. ఎప్పుడూ ఆరోగ్యవంతులుగా ఉండేలా చేస్తాయి. దాల్చినచెక్క.. ఇది అందరి వంటింట్లో ఉంటుంది. చౌకగా మార్కెట్లో దొరికే మసాలా. దీనిలోని ఔషధ గుణాలు ఆక్సిడేటివ్ ఒత్తిడిని నిరోధిస్తాయని.. దీని కారణంగా ప్రొస్టేట్ గ్రంథిలో క్యాన్సర్ కణాల వ్యాప్తి తగ్గుతుందని ఎన్ఐఎన్ ఎండోక్రోనాలజీ విభాగం అధిపతి డాక్టర్ అయేషా ఇస్మాయిల్ తెలిపారు.
దాల్చినచెక్క కారణంగా ఎముకల క్షీణత కూడా తగ్గిందని పేర్కొన్నారు. ఈ అధ్యయన ఫలితాలు అంతర్జాతీయ జర్నల్ క్యాన్సర్ ప్రివెన్షన్ రిసెర్చ్లో ప్రచురించబడింది.క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధి. ప్రస్తుతం ఈ వ్యాధి చాలా మందికి సమస్యగా మారింది. ఇందులో అనేక రకాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా గ్రంధి క్యాన్సర్ కూడా ప్రాణాంతకమైనదే. అందుకే క్యాన్సర్ను దూరం చేసే అంశంపై పలు టెస్ట్లుజరిగాయి. హైదరాబాద్లోని జాతీయ పౌష్టికాహార సంస్థ ఈ ప్రొస్టేట్ క్యాన్సర్కి మందు కనుగొనే విషయంపై జరిపిన అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి.