క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న భారత్- పాకిస్తాన్ మ్యాచ్ కు టైం దగ్గర పడుతుంది. ఆసియా కప్ 2023లో భాగంగా సెప్టెంబర్ 2న కాండీ వేదికగా దాయదుల పోరు జరగనుంది. అయితే ఈ అదిరిపోయే మ్యాచ్ జరగటం కష్టంగా అనిపిస్తుంది.. మ్యాచ్ కు వర్షం ముంపు పొంచి ఉంది.. అదే విధంగా మ్యాచ్ జరిగే సమయంలో 90% వర్షం పడే అవకాశం ఉందని వాతావరణం శాఖ వెల్లడించింది.
ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం టికెట్లన్నీ ఇప్పటికే అమ్ముడుపోయాయి కూడా.. ఈ నేపథ్యంలోనే ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న ఆందోళన అభిమానుల్లో నెలకొంది. ఈరోజు కాండే వేదికగా జరగనున్న బంగ్లాదేశ్- శ్రీలంక మ్యాచ్కు కూడా వర్షం కారణంగా ఆటంకం కలిగే అవకాశం ఉంది. అంతేకాకుండా సెప్టెంబర్ 4న భారత్- నేపాల్ మధ్య మ్యాచ్కు సైతం వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది.
ఈ ఏడాది ఆసియా కప్ శ్రీలంక- పాకిస్తాన్ వేదికగా హైబ్రిడ్ మోడల్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో మొత్తంగా 13 మ్యాచులు జరుగుతాయి. అందులో నాలుగు మ్యాచ్లు పాకిస్తాన్ వేదికగా.. మిగిలిన 9 మ్యాచులు శ్రీలంక వేదికగా జరగనున్నాయి. ఈ మెగా ఈవెంట్ను పాకిస్తాన్ మొదటి విజయంతో మంచి ఆరంభం అందుకుంది. ముల్తాన్ వేదికగా నేపాల్తో జరిగిన తొలి మ్యాచ్లో 238 పరుగులు తేడాతో పాకిస్తాన్ ఘనవిజయం సాధించింది.