టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ కెరీర్ లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో ” ఆంధ్రుడు ” ఒకటి. పరుచూరి మురళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గోపీచంద్కి జోడీగా గౌరీ పండిట్ నటించింది. శ్రీ కీర్తి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా 2005లో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన గౌరీ పండిట్ను ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోలేరు. ఈమెకు అది తొలి సినిమా అయినా తన నటనతో అందరినీ ఆకట్టుకుంది.
న్యూఢిల్లీలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది. చిన్నతనం నుంచి నటనపై ఆసక్తి ఉండడంతో.. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. పలు ప్రకటనలో నటించింది. అప్పుడే ఆంధ్రుడు సినిమాలో అవకాశం దక్కింది. మొదటి సినిమాతోనే భారీ హిట్ కొట్టినా గౌరీ ఎక్కువ కాలం ఇండస్ట్రీలో నిలవలేకపోయింది. ఆంధ్రుడు చిత్రం తరువాత కాస్కో, ఆకాశ రామన్న, నిత్యం పెళ్లి కొడుకు, రాజేంద్ర వంటి సినిమాల్లో నటించింది. కానీ ఇవేమీ ఆశించిన సక్సస్ ఇవ్వలేదు. కన్నడ, హిందీ భాషల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
కానీ అక్కడ గౌరీకి నిరాశే ఎదురైంది. అదే టైంలో బాలీవుడ్ నటుడు, నిర్మాత, బిజికెస్మ్యాన్.. నిఖిల్ ద్వివేది తో గౌరీ ప్రేమలో పడింది. 2011లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత గౌరీ వెండితెరపై కనిపించలేదు. అలాగే గౌరీ పండిట్ కు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం గౌరీ ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు. ఎందుకంటే సినిమాలుకు దూరమైన హీరోయిన్స్ ఫిట్నెస్ కి దూరమయి చాలా ఫ్యాటిగా కనిపిస్తు ఉంటారు. కానీ గౌరీ మాత్రం ఫిట్నెస్ ఏమాత్రం కోల్పోకుండా తన అందాన్ని కాపాడుకుంటూ వస్తుంది.