అమితాబ్ ఎంత పట్టుబ‌ట్టిన నటరత్న ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ ఎందుకు ఆగిపోయింది..!

తెలుగు చిత్ర పరిశ్రమలో నటరత్న ఎన్టీఆర్ సాధించిన మైలురాయి అంటూ ఏదీ లేదు. ఆయన చేయని సినిమా లేదు వెయ్యని వేషం లేదు.. పౌరాణిక, జానపద, సాంఘిక వంటి ఎన్నో సినిమాలలో ఎదురులేని హీరోగా ఎన్నో రికార్డులు సృష్టించారు. అదే సమయంలో ఆయన పలు ఇతర భాషల సినిమాల్లోనూ నటించారు.. ఈ విషయం చాలామందికి తెలియదు. ఎన్టీఆర్ తొలి రోజుల్లో తమిళ సినిమాల్లోనూ నటించారు. తర్వాత కన్నడ దిగ్గజ హీరో రాజ్‌కుమార్ చేసిన విజ్ఞప్తితో కన్నడ సినిమాల్లోనూ అన్నగారు నటించారు.

ఇలా తెలుగులోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో ఉన్న రెండు ప్రాంతీయ భాషల్లో ఎన్టీఆర్ నటించారు. ఇంకా చెప్పాలంటే ఎన్టీఆర్ నటించిన పౌరాణిక సినిమాలు తమిళ, కర్ణాటక భాషలోని అత్యధిక రోజులు ఆడేవి.. ఈ అరుదైన ఘనత కూడా ఎన్టీఆర్‌కు మాత్రమే దక్కింది. అయితే అదే సమయంలో యువ హీరోగా బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్ ఎదుగుతున్నారు.. ఇక ఎప్పుడూ జరిగే సినిమా ఈవెంట్లకు ఎన్టీఆర్ కూడా హాజరయ్యేవారు.

ఈ క్ర‌మంలోనే అమితాబ్‌.. అన్న‌గారిని బాలీవుడ్‌లోనూ న‌టించాలని.. కోరారు. అయితే.. ఈ విన్న‌పాన్ని అన్నగారు.. తిర‌స్క‌రించారు కానీ, ప‌ట్టువీడ‌ని అమితాబ్‌.. అన్న‌గారిని ప‌దే ప‌దే కోరారు. దీంతో ఒక సినిమాకు అన్న‌గారు సైన్ చేశారు. కానీ.. ఈ సినిమా నిర్మాత హ‌ఠాన్మ‌ర‌ణంతో సినిమా ప‌ట్టాలెక్క‌లేదు. ఇక‌, ఆ త‌ర్వాత‌.. అన్న‌గారు హిందీ ఇండ‌స్ట్రీ వైపు క‌న్నెత్తి చూడ‌లేదు. త‌న‌కు ప్రాంతీయ భాష‌ల ప‌ట్ల మ‌క్కువ ఎక్కువ‌ని చెప్పే అన్న‌గారు.. ప్ర‌ధ‌మ ప్రాధాన్యం తెలుగుకే ఇచ్చారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న నిర్విరామంగా తెలుగు సినిమాల‌కే ఎక్కువ‌గా ప్రాధాన్యత‌ ఇచ్చారు. అంతేకాదు.. తెలుగులోనే ఎన్నో భిన్న‌మైన సినిమాలు తీసేందుకు.. అన్న‌గారు ప్రోత్స‌హించార‌నే టాక్ కూడా ఉంది. మొత్తంగా.. అన్న‌గారు.. బాలీవుడ్ నుంచి అవ‌కాశం వ‌చ్చినా.. సున్నితంగా తిరస్క‌రించి తెలుగుపై త‌న అభిమానాన్ని చాటుకున్నార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.