మొట్టమొదటిగా యమదొంగ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది హీరోయిన్ ప్రియమణి .ఆ తర్వాత అగ్ర హీరోలతో నటించే చాన్సులను దక్కించుకుంది. తన అందంతో అభినయంతో ప్రేక్షకులను మరింత ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటిస్తోంది. ఈ అమ్మడు ఈమధ్య చాలా గ్యాప్ తీసుకుని భామకలాపం అనే సినిమా ద్వారా మళ్ళీ రీ యంట్రి ఇచ్చింది. ఇలా లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తోంది.
ఈమె సినిమాలతోనే కాకుండా ఢీ షోల ద్వారా కూడా ప్రేక్షకులకు దగ్గరగానే ఉంటుంది. వచ్చిన అవకాశాలన్నీ వాడుకుంటు కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్ కూడా నటించి కుర్రకారు మదిలో చోటు సంపాదించుకుంది. ప్రియమణి ఒకప్పుడు చకచకా సినిమాలను చేసి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఎప్పుడైతే హీరోయిన్ గా అవకాశాలు తగ్గుముఖం పట్టాయో ఆ టైంలో పెళ్లి చేసుకుంది. ప్రియమణి భర్త పేరు ముస్తఫా రాజ్ ఈయన ఒక బిజినెస్ మాన్ .. వీరిద్దరూ ప్రేమించు కొని మరి పెళ్లి చేసుకున్నారు. వీరికి పెళ్లి అయ్యి చాలా ఏళ్లు అవుతున్న పిల్లలు లేరు. ఈయన బిజినెస్ పరంగా విదేశాల్లో ఉంటూ ప్రియమణికి దూరంగా ఉంటున్నారని సమాచారం.
ప్రియమణి కూడా పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండి ఇప్పుడిప్పుడే మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. పలు డాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ అలాగే స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తోంది. అయితే తాజాగా ఈ అమ్మడు 39వ పుట్టినరోజును ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంది. ఆమె ఎంత బాగా తన బర్త్డే జరుపుకున్నప్పటికీ తనకు ఒక లోటు మాత్రం మిగిలిపోయింది. అదే తన భర్త లేడని ఫీలింగ్లో ఉంది. ప్రియమణి పుట్టినరోజును నా ఫ్యామిలీ చాలా ప్రత్యేకంగా చేసినందుకు మీ అందరికీ థాంక్స్ అంటూ బర్తడే సెలబ్రేషన్ ఫోటోలను షేర్ చేసింది.
View this post on Instagram