తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో ఎంతటి పాపులారిటీ సంపాదించిందో చెప్పాల్సిన పనిలేదు. ఇందులో ఎంతోమంది కమెడియన్లు సక్సెస్ అయ్యారు అలా కమెడియన్ హరి కూడా ఒకరు.. గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో ఇతని పేరు బాగా వినిపించింది. ఆ సమయంలో అరెస్టు కూడా అయ్యారు అప్పట్లో ఈ విషయం బుల్లితెర పైన హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పుడు తాజాగా మరొకసారి జబర్దస్త్ కమెడియన్ హరి పేరు వినిపించడంతో మరోసారి సంచలనాలకు దారితీస్తోంది.ప్రస్తుతం హరి మాత్రం పరారీలో ఉన్నట్లుగా సమాచారం.
అయితే అతని ముఠాకు చెందిన కిషోర్ అనే వ్యక్తిని మాత్రం చిత్తూరు పోలీసులు పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి దాదాపుగా కొన్ని లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం.. పూర్తి వివరాలను పలమనేరు డిఎస్పి సుధాకర్ రెడ్డి తెలియజేస్తూ.. గడచిన ఆదివారం రోజు రాత్రి పుంగనూరు పోలీసులకు వచ్చిన అధికారికంగా సమాచారం రావడంతో నగర శివారులో తనిఖీలు చేపట్టామని తెలిపారు. పోలీసులను చూసి రెండు వాహనాలు తప్పించుకునేందుకు పలు ప్రయత్నాలు చేయగా ఈ విషయాన్ని గమనించిన పోలీసులు ఆ రెండు వాహనాలను అడ్డుకున్నారట.
అయితే ఈ రెండు వాహనాలను తనిఖీ చేయక దాదాపుగా అందులో రూ.60 లక్షల రూపాయలు విలువ చేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. అలాగే రెండు వాహనాలను కూడా సీజ్ చేసినట్లుగా సమాచారం. కమెడియన్ హరి మాత్రం పరారీలో ఉన్నట్లుగా పోలీసులు తెలియజేశారు. ఇప్పటికే అతనిపైన ఎర్రచందనం అక్రమ రవాణా కేసులు చాలానే ఉన్నాయని పోలీసులు తెలిపారు. జబర్దస్త్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న హరి ఇలా ఎర్రచందనం కేసులో చిక్కుకోవడంతో అందరూ షాకు గురవుతున్నారు.