బాబోయ్ ఇదేం అరాచకం.. జడ్జిని కిస్ చేసిన జబర్దస్త్ యాంకర్..!

ఎన్నో ఏళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను అల్లరిస్తున్న ఎకైక కామెడీ షో జబర్దస్త్. ఈ టీవీ లో ప్రసారమయ్యే ఈ షో కామెడీ షో ఎంతో మంది ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వుస్తుంది. ప్రస్తుతం జబర్దస్త్ షోకి సౌమ్య రావు యాంకర్ గా నిర్వహిస్తుండగా, కృష్ణ భగవాన్, ఇంద్రజ జడ్జి లు ఉన్నారు. తాజాగా జబర్దస్త్ నుంచి ఒక ప్రోమో విడుదల అయింది. అందులో యాంకర్ సౌమ్య, జడ్జి కృష్ణ భగవాన్ కి వెళ్లి ముద్దు పెట్టింది. నిజానికి జబర్దస్త్ షో కి ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు జనాల్లో ఇంట్రెస్ట్ తగ్గిందనే చెప్పాలి. మంచి కామెడీ పుట్టించే కమెడియన్స్ అందరూ షో నుండి వెళ్లిపోయారు.

ప్రస్తుతం ఒకరిద్దరి స్కిట్ లు తప్ప షో ని పూర్తిగా చూడాలనే ఇంట్రెస్ట్ రాకపోవడం ఈ షో కి మైనస్ పాయింట్స్. అందుకే మల్లేమాలా టీమ్ వారు డిఫరెంట్ కాన్సెప్ట్లతో ప్రయోగాలు చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. జబర్దస్త్ షోకి ఈమధ్య రేటింగ్ కాస్త తగ్గింది. అయినప్పటికీ ప్రేక్షకులను అలరించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు కమెడియన్స్. అలానే యాంకర్ సౌమ్యరావుతో పాటు జడ్జ్ కృష్ణ భగవాన్ కూడా మధ్యమధ్యలో పంచ్ లతో ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి సెట్లో ఉన్న వాళ్లందరికీ షాక్ ఇచ్చారు. ఎందుకంటే కృష్ణ భగవాన్ కు సౌమ్య ముద్దు పెట్టేసరికి అందరూ ఆశ్చర్యపోయారు.

పక్కనే ఉన్న ఇంకో జడ్జి ఇంద్రజ ఆపే ప్రయత్నం చేసినా యాంకరమ్మ మాత్రం ఆగలేదు. తాజాగా ప్రోమో విడుదల చేయగా అందులో నూకరాజు, ప్రసాద్ మూకీ స్కిట్ చేశారు. కేవలం సైగలతోనే నవ్విస్తూ అలరించారు. ఇది పూర్తయిన తర్వాత నూకరాజు వెళ్లి కృష్ణ భగవాన్ చేతి పై ముద్దు పెట్టి, యాంకర్ సౌమ్యని కూడా ముద్దు పెట్టమన్నట్లు సైగ చేసాడు. దాంతో వెంటనే సౌమ్య కృష్ణ భగవన్ దగ్గరకి వెళ్లి ముద్దు పెట్టబోతుంటే ఇంద్రజ పాయింట్స్ బోర్డుని కృష్ణ భగవాన్ బుగ్గపై అడ్డుగా పెడుతుంది. దీంతో చేసేదేం లేక చేతిపై ముద్దు పెట్టి, సౌమ్య తిరిగి తన ప్లేసులో వెళ్లి కూర్చుంటుంది. ఈ ప్రోమో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది.