తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి మొదట మంచి మనోజ్ నటించిన ప్రయాణం సినిమా ద్వారా తన సినీ కెరియర్ను మొదలు పెట్టింది హీరోయిన్ పాయల్ ఘోష్. అయితే ఆ తర్వాత మిస్టర్ రాస్కెల్ సినిమాలో నటించింది. ఇక హీరోయిన్గా సక్సెస్ కాలేకపోవడంతో ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి సినిమాలో తమన్నా ఫ్రెండ్ పాత్రలో నటించింది పాయల్ ఘోష్. అయితే ఇది కూడా పెద్దగా కలిసి రాలేకపోవడంతో ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉండడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో తరచూ ఏదో ఒక విషయంలో వైరల్ గా మారుతూనే ఉన్నది. ఇప్పుడు తాజాగా ఒక డైరెక్టర్ మీద చేసిన ట్విట్ కాస్త వైరల్ గా మారుతోంది. వాటి గురించి తెలుసుకుందాం.
తెలుగులో పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో ఆ తర్వాత బాలీవుడ్ వైపు వెళ్లి పలు సీరియల్స్ లో నటిస్తోంది. అయితే సీరియల్స్ చేస్తున్న సమయంలో అక్కడ సినిమాలలో అవకాశాలు రావడం జరిగింది. కానీ అవి కూడా ఆమెకు సక్సెస్ బాట అందించలేకపోయాయి. దీంతో సినిమాలలో మాత్రం అవకాశాలు లేక కొద్ది రోజులు సైలెంట్ గా ఉండిపోయిందట. అయితే ఎప్పుడైతే బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా వేధించారని కేసు పెట్టడం జరిగిందో అప్పటినుంచి నిరంతరం వార్తలు నిలుస్తూనే ఉంది.
ఇప్పుడు తాజాగా మరొక ట్విట్ షేర్ చేయడం జరిగింది. ఇది చూసిన పలువురు నెటిజన్స్ సినీ ప్రముఖుల సైతం ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. పాయల్ ఇలా రాసుకోస్తూ సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో నేను ఇద్దరు నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ లతో పనిచేశాను స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తో కూడా వర్క్ చేశాను ఎన్టీఆర్ చాలా జెంటిల్మెన్.. నన్ను సౌత్ డైరెక్టర్స్, హీరోలు ఎవరు కూడా ఎప్పుడు అసభ్యకరంగా తనతో ప్రవర్తించలేదని కానీ బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్.. తనను కలిసిన మూడో మీటింగ్లోని రేప్ చేశారని చెప్పుకొస్తోంది అందుకే నేను సౌత్ ఇండస్ట్రీని పొగుడుతున్నానంటూ పాయల్ ఘోష్ ట్విట్ షేర్ చేయడంతో అందరూ షాక్ అవుతున్నారు.
I worked in south film industry with 2 national award winning directors &star directors but nobody even touched me inappropriately but in Bollywood I haven’t even worked with Anurag Kashyap,bt he raped me on our third meeting, now say why I shouldn’t brag about south…!!!
— Payal Ghoshॐ (@iampayalghosh) March 18, 2023