టాక్ షోలలో సెలబ్రిటీలకు ఎంత డబ్బు ఇస్తారో తెలిస్తే అవాక్కవుతారు!

ఒకప్పుడు సెలబ్రిటీల టాక్ షోలు సూపర్ హిట్స్ అయ్యేవి. ఆ తర్వాత వీటికి ఆదరణ కాస్త తగ్గింది. కాగా మళ్లీ ఇప్పుడు ఈ షోలకు పాపులారిటీ పెరిగిపోయింది. సమంత, బాలకృష్ణ, రానా లాంటి టాప్ యాక్టర్స్ ఈ షోలను నిర్వహించడం వల్ల వీటికి బాగా హైప్‌ పెరిగిపోతుంది. ఇక బుల్లితెర అనే కాకుండా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, యూట్యూబ్ ఛానల్స్‌లో సెలబ్రిటీల టాక్ షోలను జోరుగా జరుగుతున్నాయి. దీనివల్ల ఒక సెలబ్రిటీ గురించి పూర్తిగా తెలుసుకోవడం అభిమానులకు సులభమవుతోంది.

అయితే ఓటీటీ, యూట్యూబ్, బుల్లితెర ఇంకా ఇలా అన్ని రకాల షోలకి సెలబ్రిటీలు వెళ్లి ఫ్రీగా తమ గురించి అన్ని విషయాలు చెబుతున్నారా అని చాలామందిలో ఒక డౌట్ ఉంటుంది. నిజానికి ప్రతి టాక్‌ షో నిర్వాహకులు సెలబ్రిటీలకు తప్పకుండా డబ్బులు ఇస్తారు. ఉదాహరణకు ఆలీతో సరదాగా షో నిర్వాహకులు ప్రతి సెలబ్రిటీకి లక్ష రూపాయలు అందజేస్తుంది. అంతేకాదు వారి ట్రావెల్ ఎక్స్‌పెన్సివ్స్‌ కూడా భరిస్తుంది. అలాగే ఇతర టాక్ షోలు సెలబ్రిటీలకు ఎంతో కొంత పారితోషికం ఇచ్చి వారి విలువైన సమయాన్ని తమ వ్యూయర్స్ కోసం కొనుగోలు చేస్తుంటారు. అయితే ప్రమోషన్ల కోసం వచ్చేవారికి ఎలాంటి రెమ్యునరేషన్ ఇవ్వరు.

ఇక బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకి విచ్చేసే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటి వారు కూడా డబ్బులు తీసుకోరు. ఎందుకంటే వీరు తమ సొంత ప్రయోజనాల కోసం ఈ టాప్ షోలకి వస్తుంటారు. మరికొందరు సినిమా ప్రమోషన్ల కోసం ఫ్రీగా వచ్చేసి ఇంటర్వ్యూలు ఇస్తుంటారు. పెద్ద సెలబ్రిటీలు కూడా ఎలాంటి డబ్బులు తీసుకోకుండా ఇంటర్వ్యూలు ఇస్తారు. చిన్నపాటి సెలబ్రిటీలకు మాత్రం తప్పకుండా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ సెలబ్రిటీల ఇంటర్వ్యూల ద్వారా వచ్చే వ్యూస్ కారణంగా టాక్ షో నిర్వాహకులు చాలా డబ్బులు సంపాదిస్తున్నారు కాబట్టి వీరికి ఇవేమీ పెద్దగా భారం కావు.