మహేష్ సినిమా కోసం శివగామి..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం పైన మంచి బస్ ఏర్పడింది. అయితే ఈ సినిమాకి కేవలం వర్కింగ్ టైటిల్ కింద..SSMB -28 అనే టైటిల్ని అనౌన్స్మెంట్ చేశారు. ఇందులో హీరోయిన్గా పూజ హెగ్డే, శ్రీ లీల నటిస్తున్నారు. జగపతిబాబు నెగిటివ్ రోల్ లో నటిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. గత ఏడాది ఈ సినిమా షూటింగ్ను మొదలుపెట్టారు. ఈసారి దసరాకు థియేటర్లో ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఇందులో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కూడా నటించబోతున్నట్లు సమాచారం.

మహేష్ బాబు మూవీలో ఆ స్టార్ హీరోయిన్.. క్యారెక్టర్ ఏంటంటే | Ramya Krishna In Mahesh  Babu Trivikram Srinivas Movie Details , Ramya Krishna, Pooja Hegde , Mahesh  Babu, Trivikram, SSMB28 - Telugu Mahesh Babu,

వాస్తవానికి ఒక పాత్ర కోసం మొదట అలనాటి హీరోయిన్ శోభన అని మొదట చర్చలు జరిపించినట్లు వార్తలు వినిపించాయి .గత ఏడాది ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్న శోభన.. ఈ చిత్రంలో చేయడానికి అంతగా ఆసక్తి చూపించకపోవడంతో ఆమె స్థానంలో రమ్యకృష్ణ తీసుకోవాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారట. బాహుబలి సినిమా తర్వాత రమ్య కృష్ణ క్రేజ్ మరింత పెరిగిపోయిందని చెప్పవచ్చు అప్పటినుంచి ఈమెకు పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. అంతేకాకుండా పలు షోలకు జడ్జిలుగా కూడా వ్యవహరిస్తోంది.

అయితే ఇప్పటివరకు ఇమే త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించలేదు. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ సినిమా కూడా ఓకే చెప్పిందని సినీ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే SSMB -28 చిత్రం వరుస షూటింగులతో బిజీగా ఉంటున్న సమయంలోనే వాయిదా పడుతూ వస్తోంది. గడిచిన కొద్ది రోజుల క్రితం పూజ హెగ్డే కాలికి గాయం కాగా ఆ తర్వాత కొన్ని రోజులకి మహేష్ బాబు ఇంట తీవ్ర విషాదాలు చోటుచేసుకున్నాయి. దీంతో ఈ ఏడాది ఈ సినిమాని తొందరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు.