హాలీవుడ్ కి వెళ్లబోతున్న మోహన్ లాల్ చిత్రం..!!

మలయాళం లో సూపర్ స్టార్ గా మోహన్ లాల్ నటించిన స్పెషల్ చిత్రం ఏమిటంటే దృశ్యం. మీనా కీలకమైన పాత్రలో నటించిన ఈ చిత్రం మలయాళం లో పాటు తెలుగు, తమిళ్, కన్నడ ,హిందీ వంటి భాషలలో దీని సంచలన విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి సీక్వెలిగా దృశ్యం-2 కూడా ఇదే తరహాలో ఇతర భాషలలో రీమిక్స్ చేయడమే కాకుండా మంచి రికార్డులను సైతం సృష్టించి మంచి విజయాన్ని అందుకుంది. మలయాళం లో నేరుగా ఓటీటిలో విడుదలై దృశ్యం-2 మంచి ఆదరణ సంపాదించుకుంది.

Drishyam 2 (2022) - IMDbఇదే చిత్రాన్ని తెలుగులో హీరో వెంకటేష్, మీనా జోడి గానే రీమేక్ చేయడం జరిగింది. నేరుగా ఈ సినిమా కూడా ఓటీటి లోనే విడుదలై విజయాన్ని అందుకుంది. ఇక బాలీవుడ్లో అజయ్ దేవగన్, శ్రియ , టబు కలయికల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంతో బాలీవుడ్ కెరియర్ ఒక్కసారిగా మళ్లీ మలుపు తిరిగింది. ఈ సినిమా థియేటర్లలో విడుదలై దేశవ్యాప్తంగా పెను సంచలనాలను సృష్టించింది. ఎవరు ఊహించని విధంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.250 కోట్ల రూపాయలు వసూళ్లు రాబట్టడం గమనార్హం.

మలయాళం ,తెలుగు, కన్నడ, హిందీ వంటి భాషలలో ఈ సినిమా విడుదలై పెను సంచలనాలను సృష్టించింది. ఇప్పుడు హాలీవుడ్ కు ఈ చిత్రం వెళ్లబోతోందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించి దృశ్యం, దృశ్యం-2 చిత్రాలని పనోరమా స్టూడియోస్ ఇంటర్నేషనల్ సంస్థ హాలీవుడ్లో రీమిక్స్ చేయబోతోంది. ఈ విషయాన్ని తాజాగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించడం జరిగింది. సినిమాలన్నీ ఫారెన్ లాంగ్వేజ్లలో మేము రిలీజ్ చేయబోతున్నట్లుగా కూడా ప్రకటించడం జరిగింది. ఇక చైనీస్ భాషలో షిప్ వితౌట్ ఏ పర్ఫెక్ట్ గా రిమిక్ అయ్యి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక ఇండోనేషియాలో కూడా దృశ్యం సినిమా రిలీఫ్ కావడం గమనార్హం.