వేణుమాధవ్ మరణించడానికి కారణం అదేనా..?

తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది కమెడియన్లు ఇండస్ట్రీలోకి పరిచయమయ్యారు. అలాంటి వారిలో బ్రహ్మానందం ,ఎంఎస్ నారాయణ, ఆలీ తర్వాత అంతటి పేరు సంపాదించిన వారిలో కమెడియన్ వేణుమాధవ్ కూడా ఒకరు. ఎంతోమంది కమెడియన్లు ఉన్న సమయంలోనే పోటీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు వేణుమాధవ్. వేణుమాధవ్ కామెడీ టైమింగ్ తో ఎంతోమంది ప్రేక్షకులను అభిమానులను సంపాదించుకున్నారు. అయితే అనారోగ్య సమస్య కారణంగా 2019 సెప్టెంబర్ 25న మరణించారు.

Telugu comedian Venu Madhav in ICU, on ventilator support | Entertainment  News,The Indian Express

వేణుమాధవ్ ఎప్పుడు కూడా ఎలాంటి కాంట్రవర్సీలకు నోచుకోరు. కానీ వేణుమాధవ్ మరణించక ముందే చాలా రూమర్స్ వచ్చాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో వేణుమాధవ్ తల్లి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేయడం జరిగింది. అసలు విషయంలోకి వస్తే కోట్ల రూపాయల ఆస్తి ఉన్నప్పటికీ వేణుమాధవ్ తల్లి మాత్రం అద్దె ఇంట్లోనే ఉంటున్నదట. తనకు ముగ్గురు కొడుకులని వేణుమాధవ్ చిన్న కుమారుడని తనకు చిన్న వయసు నుంచే చాలా చురుకుగా ఉంటూ మిమిక్రీ చేస్తూ ఉండేవారని తెలిపింది. డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి నిర్మాత అచ్చిరెడ్డి వేణుమాధవ్ ని చూసి తన కుమారుడికి సినిమాలో ఆఫర్ ఇచ్చారని తెలిపింది.

20 కోట్లకు పైగా ఆస్తులున్నా.. అద్దె ఇంట్లో ఉంటున్న కమెడియన్ వేణుమాధవ్  తల్లి, ఏమంటుందంటే..?
దీంతో వేణుమాధవ్ నటుడుగా మంచి గుర్తింపు పొందారు. ఆ సమయంలోనే తన మిగిలిన ఇద్దరు కుమారులను కూడా వేణుమాధవ్ కు అసిస్టెంట్గా పెట్టిందట. కానీ వేణుమాధవ్ మాత్రం కామెడీయన్గా బాగా ఎదిగాడని తన ఇద్దరు కుమారులు మాత్రం ఎదగలేకపోయారని తెలిపింది.. వేణుమాధవ్ తల్లి చేసిన పెద్ద తప్పు ఏమిటంటే వేణుమాధవ్ అనారోగ్య సమస్యతో ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయడమే అన్నట్లుగా తెలియజేసింది.. వేణుమాధవ్ ఎప్పుడూ కూడా ఎలాంటి వ్యాధి వచ్చిన మందులు వేసుకునేవారు కాదు. దీంతో తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశారు అది అతని ప్రాణాలు తీసింది అని తెలిపింది. వేణుమాధవ్ కు సొంత ఇల్లు ఉంది ఫ్లాట్లు కూడా ఉన్నాయి అందులో వేణుమాధవ్ కొడుకులు ఉంటున్నారు నేను నా మూడవ కొడుకుతో అద్దె ఇంట్లో ఉంటున్నారని తెలిపింది.