జబర్దస్త్ కమెడియన్ గా పంచు ప్రసాద్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల తీవ్ర అనారోగ్యం బారిన పడడంతో పంచ ప్రసాద్ కు సహాయం చేసేందుకు కూడా తోటి కంటిస్టెంట్లు ముందుకు రావడం జరిగింది. ఇప్పటికే కిరాక్ ఆర్పి, పంచ్ ప్రసాద్ ఆపరేషన్ కు అయ్యే ఖర్చును తానే భరిస్తానని ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. ఇదంతా ఇలా ఉంటే ప్రస్తుతం స్వల్పంగా కోల్కున్న పంచ ప్రసాద్ ఇటీవలే ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తన ఆరోగ్యం పైన స్పందిస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేయడం జరిగింది.
పంచ్ ప్రసాద్ మాట్లాడుతూ..తనక సహాయం చేసేందుకు చాలా మంది జబర్దస్త్ కన్సిస్టెంట్లు ముందుకు వచ్చారు. వారందరికీ కూడా రుణపడి ఉంటాను వివాహమైన కొత్తలో నా ముక్కులో నుంచి తరచూ రక్తం వస్తూ ఉండేది దీంతో నా భార్య ఆసుపత్రికి తీసుకువెళ్లడం జరిగింది అప్పటికి తన రెండు కిడ్నీలు పాడయ్యాయని డాక్టర్లు చెప్పారట.. కిడ్నీ సమస్యలు ఉన్నవారిలో ఒక్కొక్కరికి ఒక్కోలాగా ప్రభావం చూపిస్తుందని.. నా కాలు ఎముకకు చీము రావడంతో నడవలేని పరిస్థితిలోకి వెళ్లిపోయారని ప్రస్తుతం కాస్త స్వల్పంగా కోరుకున్నానని దీంతో పలుచోలు చేయడం మొదలు పెట్టానని తెలిపారు.
అయితే తన కాలుకు చీము రావడం వల్ల ఆపరేషన్ వాయిదా వేశారని తెలియజేయడం జరిగింది. ఇప్పటికే తనకి కిడ్నీ డోనర్స్ దొరికారని కాలు నొప్పి తగ్గే వరకు డాక్టర్లు ఆపరేషన్ చేయాలని పంచ ప్రసాద్ తెలియజేయడం జరిగింది. అయితే తాను త్వరగా కోలుకోవాలని తనకోసం ప్రార్ధించాలని ఒక అభిమాని అయితే కుటుంబంతో సహా తిరుపతికి వెళ్లి కాలినడకన ఎక్కారంటూ పంచు ప్రసాద్ తెలిపారు. ఇలా తన ఆరోగ్యం గురించి బాధపడ్డ ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలిపారు.