టాలీవుడ్ లో నందమూరి తారకరామారావు మనవడిగా నందమూరి తారకరత్న తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. 2022లో ఒకటో నెంబర్ కుర్రాడి సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తారకరత్న ఇప్పటివరకు 20 కి పైగా సినిమాలలో నటించి అలరించారు. తాను రోల్ హీరో కాకుండా విలన్ రోల్ కూడా చేయాలని నిర్ణయించుకున్నాడు .
ఇక నందమూరి ఫ్యామిలీలో ప్రత్యేక స్థానం ఉన్న తారకరత్న.తన ఫ్యామిలీకి ఐదేళ్లు దూరం కావాల్సి వచ్చిందనే వార్తలు గతంలో వినిపించాయి.ఎందుకంటే తారకరత్న 2012లో అలేఖ్య రెడ్డిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరిద్దరిది రహస్య పెళ్లి అయితే అప్పటికే అలేఖ్య రెడ్డి దివంగత మాజీ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి చిన్న కోడలు మాధవరెడ్డి కొడుకు సందీప్ రెడ్డి తో మొదటి పెళ్లి జరిగింది. ఆ తర్వాత కొన్ని కారణాలతో విడిపోయారు. ఆ తరువాత సినిమా షూటింగ్ టైంలో తారకరత్న అలేఖ్య ఇద్దరు ప్రేమలో పడి రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.
ఇక వీరి వివాహం ఇరు కుటుంబాలకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకనే నందమూరి ఫ్యామిలీకి తారకరత్న ఐదేళ్లు దూరం కావాల్సి వచ్చింది. ఇప్పుడిప్పుడే వారి కుటుంబ సభ్యులతో కలుస్తూ అంతా సర్దుకుంటోంది అనే టైంలోనే తారకరత్నకు ఇలా జరిగింది. ఇక తారకరత్న అలేఖ్య రెడ్డి ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉండేవారు. వీరిద్దరికి ఒక కూతురు కూడా ఉంది. తన కూతుర్ని చూసుకుంటూ ఇప్పటివరకు బాగానే ఉన్నారు. ఈ మధ్యలోనే రాజకీయాలోకి ఎంట్రీ ఇచ్చాడు తారకరత్న తెలుగుదేశం పార్టీ తరపున పాదయాత్రకు వెళుతున్న సమయంలో అనారోగ్య బారిన పడ్డారు తారకరత్న. ఆ సమయంలోని గుండెపోటు రావడంతో హుటాహుటిగా హాస్పిటల్ కి చేర్పించారు ఇక ఆ తర్వాతే మెరుగైన వైద్యం కోసం బెంగళూరులో నారాయణ హృదయాలయ హాస్పిటల్ కి చేర్పించారు దాదాపుగా 23 రోజుల తర్వాత మరణించారు తారకరత్న.