నందమూరి తారకరత్న మరణంతో తెలుగు రాష్ట్ర ప్రజలు శోకసముద్రంలో మునిగిపోయారు. తారకరత్న సినిమాలలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ కెరియర్లు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవడం జరిగింది. దీంతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. ఇక పొలిటికల్గా తన ఎంట్రీ కోసం పలు కసరతులు కూడా మొదలుపెట్టారు. తారకరత్న వచ్చే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. టిడిపి పార్టీ కార్యక్రమాలలో కూడా నందమూరి తారకరత్న చాలా చురుకుగా పాల్గొనేవారు. లోకేష్ యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్రకు సంబంధించి అన్ని విషయాలను కూడా దగ్గరుండి ఏర్పాటు చేసుకున్నారు. స్వయంగా కుప్పం వెళ్లి మరి దాని దగ్గరుండి చూసుకోవడం జరిగింది తారకరత్న.
ఇక పార్టీ నేతలను కూడా తారకరత్న కలుపుకొని పనిచేస్తూ ఉండేవారు.హిందూపురం మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకట రాముడు కలిశారు. ఆయన ఇంటికి వెళ్లి నియోజకవర్గ రాజకీయ పరిస్థితుల పైన కూడా చర్చించారు. ఈ సందర్భంగా తారకరత్నను ఘనంగా సత్కరించారు పరిటాల రవి 18 వ వర్ధంతి రామగిరి మండలంలో వెంకటాపురం గ్రామంలో జరిగిన పరిటాల షూట్ కు వెళ్లి కూడా నివాళులు అర్పించారు. అలాగే గుంటూరుకు వెళ్ళి తారకరత్న టిడిపి ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ కూడా వస్తారని తెలిపారట.
సమయం వచ్చినప్పుడు తమ్ముడు కూడా కచ్చితంగా వస్తారని ఆంధ్రప్రదేశ్లో టిడిపికి అందరం అండగా నిలవాల్సిన అవసరం వచ్చిందని కూడా తెలిపారు. రాబోయే జనరల్ ఎలక్షన్లలో ఏపీ నుంచి ఎన్నికలలో పోటీ చేస్తున్నానని తెలిపారు తారకరత్న. ఇక దీంతో చంద్రబాబు తారకరత్నకు ఒక సీటు కేటాయించారని ప్రచారం జరిగింది. అయితే తారకరత్నకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని నుంచి కేటాయిస్తారని అంశం చాలా ఆసక్తికరంగా మారింది కానీ ఇంతలోనే తారకరత్న అనారోగ్య సమస్యతో హాస్పిటల్ కి చేరడం మరణించడం వంటిది జరిగింది.