పూజా హెగ్డే, రష్మిక మందన్నా ఇద్దరిలో ఎవరు ఎక్కువ తీసుకుంటున్నారో తెలుసా?

పూజా హెగ్డే, రష్మిక మందన్నా గురించి తెలుగు వాళ్ళకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు స్టార్ హీరోయిన్స్ లో వీరు ఇరువురూ ముందు వరుసలో వుంటారు. వీరిద్దరు ప్రస్తుతం ఇక్కడ చేస్తున్న సినిమాలు తక్కువే అయినా రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం ఎక్కడా తగ్గమని తెగేసి చెబుతున్నారట. ఆ మధ్య పుష్ప సినిమాతో రష్మిక మందన తన పారితోషికంను ఏకంగా రెట్టింపు చేసిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అదే విధంగా అల వైకుంఠపురంలో సినిమా ఇండస్ట్రీ హిట్ సొంతం చేసుకోవడంతో పూజ హెగ్డే తన రెమ్యూనరేషన్ ని రెండు నుండి మూడు కోట్ల రూపాయలకు పెంచేసిందని సమాచారం.

అయితే ఇపుడు ఇద్దరు కూడా బాలీవుడ్లో వరుస ప్రయత్నాలు అందుకుంటున్నారు. సౌత్ విషయానికొస్తే తమిళం, తెలుగు, కన్నడ అనే తేడాలేకుండా అడపాదడపా సినిమాలు చేస్తూ రెండు చేతులనిండా దండిగా సంపాదిస్తున్నారు అని భోగట్టా. ఈ తరుణంలోనే వీరి ఇద్దరి రెమ్యునరేషన్స్ విషయంలో ఓ చర్చ సోషల్ మీడియాలో వాడివేడిగా సాగుతోంది. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. మరో వైపు అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న పుష్ప 2 సినిమా లో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ రెండు సినిమాలకు వారు తీసుకున్న పారితోషకం పరిశీలించినట్లయితే పూజా హెగ్డే తో పోలిస్తే రష్మిక రెమ్యూనరేషన్ ఎక్కువ అన్నట్లుగా తెలుస్తోంది. పుష్ప పార్ట్‌ 1 లో రష్మిక మందన నటించిన తరువాత ఆమె ఇపుడు పుష్ప సీక్వెల్లో నటిస్తోంది. అందుకుగాను రష్మిక మందన దాదాపుగా 5 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక పూజ హెగ్డే విషయానికి వస్తే గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి కాబట్టి పారితోషికం పెద్దగా పెరిగిన దాఖలాలు కనబడడం లేదు. అందుకే మహేష్ బాబు కి జోడిగా పూజ హెగ్డే ని ఎంపిక చేసిన త్రివిక్రమ్ రెమ్యూనరేషన్ విషయంలో కాస్త తగ్గించి ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.