చిక్కుల్లో పడ్డ ప్రభాస్ ఆది పురుష్ సినిమా..?

టాలీవుడ్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రాలలో ఆదిపురుష్ సినిమా కూడా ఒకటి. ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. మొదట ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతున్న సమయంలో సెట్ లో అగ్ని ప్రమాదంతో వార్తల్లో నిలిచిన ఈ సినిమా ఇప్పటికీ కూడా ఏదో ఒక వివాదంలో చిక్కుకొంటూ పలు వార్తలు నిలుస్తూనే ఉంది. కృతి సనన్ సీత పాత్రలో నటించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అయిపోయినప్పటికీ VFX కారణంగా లేట్ అవుతోంది.

Adipurush teaser: Prabhas' Lord Ram gets ready to battle Saif Ali Khan's  Lankesh in a jerky CGI fest | Entertainment News,The Indian Express
ఇదివరకే ఈ సినిమా టీజర్ను విడుదల చేయగా ఈ సినిమా పైన దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువడ్డాయి. శ్రీరాముడిగా ప్రభాస్ మేకవర్ రావణ బ్రాహ్మణ సైఫ్ అలీ ఖాన్ చూపించిన తీరు సీత పాత్రలో కృతి సనన్ ,ప్రభాస్ ల మధ్య వచ్చే సన్నివేశాలు హనుమంతుడి క్యారెక్టర్ ఇలా అన్నీ కూడా విమర్శలు ఎదురయ్యేలా చేశాయి. దీంతో చిత్ర బృందం గ్రాఫిక్స్ వరకు కోసం మరొక రూ.100 కోట్ల రూపాయలు రివర్కు చేయడానికి కేటాయించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది.

Adipurush News: Was the promo of 'Adipurush' released without taking the  certificate? Now the court has
ఇప్పుడు తాజాగా మరొకసారి వార్తల నిలుస్తోంది ఈ చిత్రం. ఈ సినిమాకు సంబంధించి టీజర్ ని ఎలాంటి సెన్సార్ లేకుండా ప్రదర్శించారని కుల్దీప్ అనే వ్యక్తి కోర్టుని ఆశ్రయించడం ఇప్పుడు వివాదాస్పందంగా మారుతోంది. ఆది పురుష్ టీజర్ పై అలహాబాద్ కోర్టులో వ్యక్తి కేసు వేయడం జరిగింది.సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ రాకుండానే టీజర్ ని చిత్ర బృందం విడుదల చేసిందని కేసు వేయడం జరిగింది. అంతేకాకుండా సీతాదేవి పాత్రలో నటించిన కృతి సనన్ దుస్తులపైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కోర్టు సెన్సార్ బోర్డుకి నోటీసులు జారీ చేసింది తన తదుపరి విచారణ ఫిబ్రవరి 21కి వాయిదా వేసింది.