డైరెక్టర్ రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన చిత్రాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి. అలా వీరిద్దరి కాంబినేషన్తో వచ్చిన చిత్రాలలో సింహాద్రి సినిమా కూడా ఒకటి. ఈ సినిమా మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్లుగా భూమిక ,అంకిత నటించారు. ఈ చిత్రం 2003 జూలై 9 వ తేదీన విడుదలై అప్పట్లో పేను సంచలనాన్ని సృష్టించింది. దాదాపుగా ఈ సినిమాని రూ .8కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో నిర్మించారు.
దీంతో ఈ సినిమా రూ .26 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. ఈ చిత్రానికి సంగీతాన్ని ఎం ఎం కీరవాణి అందించారు. ఈ చిత్రంలోని సాంగ్స్ కూడా బాగానే ఆకట్టుకున్నాయి.హీరోయిన్ అంకిత గతంలో లాహిరి లాహిరి లాహిరిలో, ధనలక్ష్మి ఐ లవ్ యు, ప్రేమలో పావని కళ్యాణ్ వంటి చిత్రాలలో నటించి మెప్పించింది. చివరిసారిగా ఇమే వచ్చిన పోలీస్ అధికారి చిత్రంలో నటించింది. ఆ తర్వాత చిత్రాలకు పూర్తిగా దూరమైంది. అంకిత బాలనటి గానే సిరి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అప్పట్లో ఈమె ఫేమస్ అయిన రస్నయాడ్ కూడా మంచి పాపులారిటీ అందుకున్నదే.
అలా పలు కమర్షియల్ ప్రకటనలో నటించి ఆ తర్వాత వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన లాహిరి లాహిరి లాహిరిలో అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యింది. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడంతో తెలుగులోనే భారీగా అవకాశాలు వెలుపడ్డాయి. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా పలు చిత్రాలలో నటించింది అంకిత. ఇక ఈమె అభిమానుల సైతం ఈమె గురించి వెతకంగా ఈమెకు సంబంధించి పలు ఫోటోలు చూసి షాక్ అవుతున్నారు అభిమానులు. ఈమె పూణేకు చెందిన వ్యాపారవేత్త విశాల్ ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఈమె ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
View this post on Instagram