తెలుగు సినీ ఇండస్ట్రీలోకి కొత్త బంగారులోకం సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది శ్వేతా బసు ప్రసాద్. అయితే ఈ సినిమా కంటే ముందే ఈమె చైల్డ్ యాక్టర్ గా పలు సినిమాలలో కూడా నటించి గుర్తింపు తెచ్చుకుంది. కేవలం కొత్త బంగారులోకం సినిమా ద్వారా వరుణ్ సందేశ్ సరసన నటించింది .అయితే ఈ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంతో శ్వేతా బసు ప్రసాద్ కు మంచి క్రేజీ వచ్చింది .ఈ సినిమా తర్వాత మళ్లీ అలాంటి సక్సెస్ అయితే అందుకోలేకపోయింది ఈ ముద్దుగుమ్మ.
శ్వేతా బసు ప్రసాద్ కు వరుస ఆఫర్లు వచ్చాయి కానీ ఎక్కువ కాలం ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయింది. చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. అంతేకాకుండా కొన్నాళ్ల తర్వాత పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్ లలో కూడా నటించింది. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మాత్రం ఈమె ఊహించని స్థాయిలో కనిపిస్తు కుర్రకారులకు మతి పోగొట్టేలా చేస్తూ ఉంటుంది. ఒకప్పుడు చాలా క్యూట్ గా కనిపించిన శ్వేతా బసు ప్రసాద్ ఇప్పుడు మాత్రం నాటు లుక్కులో కనిపిస్తోంది.
ప్రస్తుతం శ్వేతాబసు ప్రసాద్ ఫేస్ మొత్తం పూర్తిగా మారిపోయిందని పలువురు నేటిజన్లు ఈ ఫోటోలను చూసి కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు కూడా ఈమె హీరోయిన్గా ప్రయత్నిస్తే భవిష్యత్తు బాగుంటుందని సరైన పాత్రలు వస్తే ఈమె హీరోయిన్గా మళ్లీ పుంజుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు. కెరియర్ మధ్యలో కొన్ని చేదు సంఘటనలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది శ్వేతా బసు ప్రసాద్ ప్రస్తుతం పలు హిందీ సినిమాలలో నటిస్తున్నట్లు సమాచారం.
View this post on Instagram