టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ బ్యాక్ టు బ్యాక్ హిట్ల తో కెరీర్ పరంగా జంట స్పీడ్ లో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా ఈ యంగ్ హీరో `హిట్ 2` సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఇందులో మీనాక్షిచౌదరి హీరోయిన్ గా నటించింది.
వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్పై హీరో నాని, ప్రశాంత్ తిపిరినేని సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అయితే `హిట్ 2` ఇచ్చిన సక్సెస్ తో అడివి శేష్ తన రెమ్యునరేషన్ ను భారీగా పెంచేశాడని టాక్ నడుస్తోంది.
ఇంతకు ముందుకు శేష్ ఒక్కో సినిమాకు రూ. 5 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకునేవాడట. కానీ, ఇప్పుడు రూ. 8 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ను డిమాండ్ చేసుకున్నాడట. ఇక శేష్కు ఉన్న క్రేజ్, మార్కెట్ దృష్ట్యా నిర్మాతలు సైతం అంత మొత్తం ఇచ్చేందుకు ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదని ప్రచారం జరుగుతోంది.