రష్మిక అంతలా ఎమోషనల్ అవ్వడానికి కారణం..?

పాన్ ఇండియా హీరోయిన్గా రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలలో చాలా బిజీగా ఉన్నది. అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తన హవా కొనసాగిస్తూ ఉంది ఈ ముద్దుగుమ్మ. ఒక ఇటీవల గుడ్ బై సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం పుష్ప -2 సినిమా చిత్రీకరణలో పాల్గొనబోతోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో క్షణం తీరిక లేకుండా తమ సమయాన్ని గడిపేస్తోంది రష్మిక. తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో ఒక ఎమోషనల్ నోట్ రాయడం జరిగింది ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతొంది. వాటి గురించి తెలుసుకుందాం.

Rashmika Mandanna opens up about drawing a line with her parents: 'Don't  try to control my life because…' | Entertainment News,The Indian Express

రష్మిక పై వస్తున్న ట్రోల్స్, రూమర్స్ గురించి చాలా ఆవేదన చెందుతూ..సోషల్ మీడియాలో చేసే నెగటివ్ ప్రచారం పైన ఒక విషయాన్ని తెలియజేసింది. తన మీద వచ్చిన ట్రోల్స్ తన హృదయానికి చాలా గాయపరుస్తున్నాయని తెలియజేస్తోంది. తాజాగా తన మనసులో బాధని ఇలా రాసుకుంది రష్మిక. గత కొన్ని రోజులుగా కొన్ని విషయాలు తనని చాలా ఇబ్బంది పెడుతున్నాయని..ఇప్పుడు వాటిని పరిష్కరించే సమయం వచ్చిందనుకుంటున్నానని తెలియజేస్తుంది. నేను నా కోసం మాత్రమే మాట్లాడుతున్నాను..నేను ఈ పని చాలా సంవత్సరాల క్రిందే చేయవలసి ఉంది.. నేను నా కెరియర్ ప్రారంభించినప్పటి నుంచి అనేకసార్లు ద్వేషానికి గురవుతున్నాను.

చాలాసార్లు తనమీద ట్రోల్స్, నెగెటివిటీ వంటి గురించి మాట్లాడడం చాలా బాధిస్తుందని తెలియజేసింది. నాకు తెలుసు నేను ఎంచుకున్న జీవితం చాలా కష్టమైనదని ప్రతి ఒక్కరు నన్ను ప్రేమిస్తారనుకోను మీకు నేను నచ్చకపోతే నా మీద నెగెటివిటీ చేయాలని లేదు.. రోజురోజుకు నేను చేసే పని ప్రాముఖ్యత నాకు తెలుసు నా పని చూసి మీరు ఆనందించడమే నేను ఎక్కువగా పట్టించుకుంటాను.. మీరు నేను గర్వించదగిన విషయాలను బయట పెట్టడానికి నా సాయి శక్తుల ప్రయత్నిస్తానని తెలియజేసింది. రష్మిక రాసిన ఈ నోట్ ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతుంది.