కొత్త లుక్‌లో మరింత హాట్‌గా కనిపిస్తున్న ప్రియమణి.. చూస్తే మతి పోవాల్సిందే!

ఒకప్పటి స్టార్ హీరోయిన్స్‌లో చాలామంది తెరమెరుగయ్యారు. కానీ మీనా, ఇంద్రజ, ఆమని వంటి హీరోయిన్లు బుల్లితెర లేదా వెండితెరపై రాణిస్తూ అలరిస్తున్నారు. పెళ్లయిన కొత్తలో హీరోయిన్ ప్రియమణి కూడా ఇప్పటికీ సినిమాల్లో ఛాన్సులు తగ్గించుకుంటూ అదరగొడుతోంది. ఈ అమ్మడుకు నటన, డ్యాన్స్, అందం ఇలా హీరోయిన్‌కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని ఉన్నాయి. ఈ భామ వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ ముందుకు దూసుకెళ్లిపోతూ ఉంటుంది. అలాగే అవకాశాలను పెంచుకునేందుకు తన అందాలను ఆరబోసేందుకు కూడా వెనకాడదు.

ప్రియమణి తన సెకండ్ ఇన్నింగ్స్‌ని బుల్లి తెరపై స్టార్ట్ చేసింది. అలానే అడపాదడపా సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ప్రియమణి తన వివాహ జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తూ, బుల్లితెరపై టీవీ ప్రోగ్రామ్స్ లో బిజీగా అయిపొయింది. ఈ టీవీలో ప్రసారమయ్యే ఢీ 14 అనే డ్యాన్స్ షోలో జడ్జీగా వ్యవహారిస్తుంది. అంతే కాకుండా వెబ్‌సిరీస్‌లు, సినిమాలో కూడా ఆఫర్స్ వస్తున్నాయి. ప్రియమణి మంచి నటి మాత్రమే కాదు, మంచి డాన్సర్ కూడా. ఎన్టీఆర్, నాగార్జున లాంటి హీరోల పక్క మాస్ స్టెప్పులు వేసి ప్రేక్షకులను అల్లరించింది. నితిన్ సరసన ద్రోణ సినిమా లో హీరోయిన్ గా నటించిన ప్రియమణి ఆ చిత్రం లో బికినీ వేసుకొని ఒక ఊపు ఉపేసింది.

ఇప్పుడు 33 ఏళ్లు ఇచ్చినా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా ద్వారా తన ఫోటోలు షేర్ చేస్తోంది. అలాగే అందాలను చూపించి చూపించినట్లు ఊరిస్తోంది. తాజాగా కూడా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫొటోలలో ప్రియమణి కొత్త లుక్‌లో కనిపిస్తుంది. పింక్ కలర్ డ్రెస్ లో కొత్తగా ట్రై చేసింది. ఆ డ్రెస్‌లో ప్రియమణి ఇచ్చిన ఫోజులు చూసి అభిమానులు వావ్ అంటున్నారు. ముఖ్యంగా ఆమె కళ్ళని చూసి మైమరచి పోతున్నారు. ప్రియమణి కళ్లలో ఏదో మ్యాజిక్ ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రియమణి తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన తరువాత మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఫ్యామిలీ మ్యాన్ 2 లో ఆమె మనోజ్ భాజ్ పాయ్ భార్యగా నటించింది. వెంకటేష్ సరసన నారప్ప సినిమాలో నటించింది. ఈ రెండింటిలో ప్రియమణి నటనకు మంచి స్పందన వచ్చింది.