పాపం పూజా హెగ్డే.. ఏదో అనుకుంటే ఇంకేదో జ‌రుగుతుంది?!

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజ హెగ్డేకి గత కొంతకాలం నుంచి బ్యాడ్ టైం నడుస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది వరకు వరుస హిట్లతో దూసుకుపోయిన పూజా హెగ్డేకి ఈ ఏడాది ఏ మాత్రం కలిసి రాలేదు. ఈమె నటించిన రాధాశ్యామ్, ఆచార్య, బీస్ట్ చిత్రాలు ఈ ఏడాది విడుదలై ఎలాంటి ఫలితాలను అందుకున్నాయో తెలిసిందే.

ప్రస్తుతం పూజా హెగ్డే ఓ మంచి హిట్ కోసం ఆరాటపడుతుంది. ఇందుకోసం ఆమె టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబునే నమ్ముకుంది. ప్రస్తుతం మహేష్ బాబుకు జోడిగా పూజా `ఎస్ఎస్ఎంబి 28`లో నటిస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న‌ ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమై.. ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది.

దసరా అనంతరం రెండో షెడ్యూల్ ను ప్రారంభించాలని భావించారు. కానీ అంతలోనే మహేష్ తల్లి ఇందిరాదేవి మరియు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కనుమూయడంతో.. ఈ మూవీ షూటింగ్ వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. ఇక‌ ఇప్పట్లో ప్రారంభమయ్యే సూచనలు కూడా కనిపించడం లేదు. అసలే పూజా హెగ్డే ఈ సినిమాతో త్వరగా అపేక్షకుల ముందుకు వచ్చే హిట్టు కొట్టాలని ఆరాటపడుతుంది. కానీ ఏదో అనుకుంటే ఇంకేదో జరుగుతుంది. పూజా అనుకున్న‌ది ఏమీ జ‌ర‌గ‌డం లేదు. మ‌రి మ‌హేష్ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందో.. పూజాకు హిట్ ఎప్ప‌టికి ప‌డుతుందో.. చూడాలి.