ఆయుర్వేద వైద్యం ప్రకారం మన వంటగది మనకు వచ్చిన అన్ని రకాల వ్యాధులను నివారించడానికి ఉపయోగపడే అనేక రకాల సుగంధ ద్రవ్యాలు ఆహార రుచిని పెంచడమే కాకుండా మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. మనం రోజు వారి వాడే మసాలా దినుసులు మన బరువు తగ్గించడంలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ప్రస్తుతం ఉన్న రోజుల్లో చాలామందికి మధుమేహ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారి కి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి ఆహారంలో అనేక రకాల మూలికలు కూడా వాడుకోవచ్చు.. ఆ మూలకులు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
త్రిఫల- త్రిఫల మన శరీరంలో ఉన్న అనేక అనారోగ్య సమస్యలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని కూడా తగ్గిస్తుంది. ఇన్సులిన్ స్థాయిలను పెంచుతుంది.
వేప- మనం వేప ఆకులు చేదుగా ఉంటాయని మనం వాటి జోలికి వెల్లం. కానీ వేపాకు వల్ల మన శరీరంలోను అనేక అనారోగ్య సమస్యలు నివారించబడతాయి. వేపాకులు రక్తంలో చక్కెర స్థాయిని ఆదుపులో ఉంచుతాయి. వేప ఆకులను నీటిలో వేసి మరిగించి వేప కషాయం తయారు చేస్తారు.
ఉసిరికాయ- ఉసిరికాయలో విటమిన్ సి ఎంతో పుష్కలంగా ఉంటుంది. ఈ ఉసిరికాయలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. మన శరీరంలో ఉన్న ఫ్రీ రాటికల్స్ దెబ్బతినకుండా ఇవి కాపాడుతాయి.. ఉసిరికాయ మన శరీరంలో ఉన్న రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇక రక్తం లో ఉన్న చక్కెర స్థాయిని కూడా నియంత్రించడంలో సహాయపడుతుంది.
కాకరకాయ రసం- కాకరకాయ చేదుగా ఉండొచ్చు కానీ ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. డయాబెటిస్ ఉన్న వారిలో టైప్ 1 టైప్2 రోగులకు ఇది చాలా ఉపయోగ పడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచడంలో ఎంతో సహాయపడుతుంది.