సౌత్ సినిమా పరిశ్రమలో మరో ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కబోతుంది. కోలీవుడ్ యంగ్ హీరో గౌతమ్ కార్తీక్.. హీరోయిన్ మంజీమా మోహన్ ప్రేమలో ఉన్నట్టు తాజాగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. వీరిద్దరూ 2019లో విడుదలైన దేవరాట్టం సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ మధ్య పరిచం ఏర్పడింది. ఆ పరిచయమే ప్రేమగా మారిందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టగా.. ఆ వార్తలను నిజం చేస్తూ మేమిద్దరం ప్రేమలో ఉన్నామని అధికారికంగా ప్రకటించారు.
అంతేకాకుండా ఈనెల 28న చెన్నై సమీపంలో ఓ స్టార్ హోటల్లో వీరి పెళ్లి జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. వీరి వివాహానికి సన్నిహితులు, బంధువులు, కొద్దిమంది సిని ప్రముఖులు వస్తారని కూడా తెలుస్తుంది. అయితే ఈ సందర్భంలోనే మంజిమా మోహన్ తన instagram ఖాతాలో ఉన్న ఫోటోస్ అన్నింటిని డిలీట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఆమె అలా చేయడంతో అందరిలో కొత్త అనుమానాలు వచ్చాయి.
తాజాగా తను ఫొటోస్ డిలీట్ చేయడంపై ఈమె స్పందిస్తూ.. గత జ్ఞాపకాలను తొలగిస్తూ కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాను కాబట్టే పాత జ్ఞాపకాలను చూసి బాధపడకూడదనే తన ఇన్ స్టాలో ఉన్న ఫోటోలను డిలీట్ చేశానని. అంతేకాకుండా తన అడుగు పెట్టబోయే కొత్త జీవితానికి సంబంధించిన జ్ఞాపకాలను పదిలంగా దాచుకోవడానికి చోటు అవసరం అందుకే వాటిని డిలీట్ చేసానని చెప్పుకొచ్చింది. కేవలం కాభోయే భర్త గౌతమ్ కార్తీక్ తో ఉన్న ఫొటోస్ మాత్రమే తన ఇన్ స్టాలో ఉంచారు మంజీమా. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో శింబు కు జంటగా పతుతాళ సినిమాలో నటిస్తోంది.
View this post on Instagram