‘పొన్నియన్ సెల్వన్’ సంచలన రికార్డ్.. మూడో రోజుల్లో రూ.300 కోట్లు..!?

తమిళ ప్రేక్షకులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన సినిమా “పొన్నియిన్ సెల్వన్”1 . ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా భారీ అంచనాలతో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ బాహుబలి గా పిలుచుకుంటున్న ఈ సినిమాలో విక్రమ్, ఐశ్వర్యారాయ్, కార్తీ, జయం రవి, త్రిష, ప్రకాష్ రాజ్, శరత్ కుమార్ వంటి స్టార్ నటులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తానని మణిరత్నం ఎప్పుడో చెప్పాడు. తాజాగా మొదటి భాగం పాన్ ఇండియా లెవెల్ లో సెప్టెంబర్ 30న విడుదలైంది. అయితే ఈ సినిమా విడుదలైన రెండు రోజు నుంచి భారీ నెగిటివ్ టాక్ ను అందుకుంది.

Mani Ratnam's Ponniyin Selvan teaser gets 20 million views

ఈ సినిమా టాక్ ఎలా ఉన్నప్పటికీ కలెక్షన్ల విషయంలో మాత్రం ఎవరు ఊహించని అంచనాలతో దూసుకు పోతుంది. ఈ సినిమా రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 230 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా అక్టోబర్ 3వ తేదీ నాటికి ఏకంగా 300 కోట్ల కలెక్షన్ దిశగా దూసుకుపోతుంది. ఇదే రకంగా ఈ సినిమా కలెక్షన్లను రాబడితే ప్రాఫిట్ జోన్ లోకి వెళ్తుందని చెప్పవచ్చు. సౌత్ నుంచి విడుదలైన త్రిబుల్ ఆర్, కే జి ఎఫ్ , పుష్ప సినిమాల తర్వాత భారీ కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా పొన్నియిన్ సెల్వన్ రికార్డులకు ఎక్కనుంది.

Ponnniyin Selvan Telugu Review : పొన్నియిన్ సెల్వన్ తెలుగు మూవీ రివ్యూ అండ్ రేటింగ్ - Yuvataram

సినీ ట్రేడ్ వర్గాల ప్రకారం ఈ సినిమా థియేటర్లలో భారీ కలెక్షన్ల దిశగా దూసుకుపోతుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రెండు రోజుల్లోనే ఏకంగా 250 కోట్ల కంటే ఎక్కువ వసూలు రాబట్టింది. ఈ సినిమాను మణిరత్నం కల్కి రచించిన చోళ రాజవంశం వారి కాలంలో జరిగిన సంఘటనల ఆధారంగా రచించిన పుస్తకం ఆధారంగా మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కించాడు.